Parvathipuram Election Fight: పార్వతీపురం మన్యం Parvathipuram Manyam జిల్లాలోని పార్వతీపురం parvathipuram SC అసెంబ్లీ నియోజక వర్గంలో 2019 ఎన్నికల అలజంగి జోగారావు Alajangi Jogarao వైఎస్సార్సీపీ Ysrcp తరపున గెలిచారు. 2014లో TDP టీడీపీ తరపున గెలిచిన బొబ్బిలి చిరంజీవులు 2019లో ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో టీడీపీ తరపున Bonela VijayaChandra బోనెల విజయచంద్ర టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు.
అలజంగి జోగారావు ఎన్నికల ముందు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. 2019 ఎన్నికల్లో ప్రచారం చాలా తక్కువగా చేశారు. ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. వైసీపీ హవాలో గెలిచారు.
ఎమ్మెల్యే భార్య ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. వీరిక ఒక కుమార్తె ఉంది. విద్యాభ్యాసం చేస్తోంది. వీరిలో ఎవరికీ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు లేవు. కానీ కొన్ని పనులు మాత్రం ఎమ్మెల్యే సతీమణికి చెబితే జరుగుతాయనే ప్రచారముంది. బంధువులు, మిత్రులు ఈమెను ఇంట్లో కలిసి పనులు చక్కబెట్టుకొంటారు.
జోగారావు కుటుంబానికి మొదటి నుంచీ రాజకీయ నేపథ్యం ఉంది. ఇతని తల్లి బలిజిపేట ఎంపీపీగా, సర్పంచిగా పనిచేశారు. బొత్స ఝాన్సీలక్ష్మి జడ్పీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు ఆమె వ్యవహారాలన్నీ జోగారావు చూసేవారు. అప్పుడే బొత్సకు నమ్మకస్తుడిగా మారడంతో బినామీ అయ్యారు. అందుకే పార్వతీపురం టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారనే ప్రచారం ఉంది. జోగారావు స్థిర నివాసం విజయనగరం కావడంతో అక్కడి నుంచే అంతా నడిపిస్తుంటారు.
ఎమ్మెల్యే అన్న అలజంగి రవికుమార్ బలిజిపేట జడ్పీటీసీ సభ్యుడు. అక్కడ ఆయన క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఏ పని జరిగినా అతనితో పాటు ఎమ్మెల్యే మరో సోదరుడి కనుసన్నల్లోనే జరుగుతోంది.
సంబంధిత కథనం