World Cup In Vizag: తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరే న్యూస్.. వైజాగ్ లో వరల్డ్ కప్ మ్యాచ్.. ఎప్పుడంటే?-womens world cup match will heid in vizag opening ceremony india vs south africa odi on 6th december ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  World Cup In Vizag: తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరే న్యూస్.. వైజాగ్ లో వరల్డ్ కప్ మ్యాచ్.. ఎప్పుడంటే?

World Cup In Vizag: తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరే న్యూస్.. వైజాగ్ లో వరల్డ్ కప్ మ్యాచ్.. ఎప్పుడంటే?

World Cup In Vizag: తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. వైజాగ్ అంతర్జాతీయ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతోంది. ఈ ఏడాది జరిగే వుమెన్స్ వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీతో పాటు ఫస్ట్ మ్యాచ్ కు విశాఖ ఆతిథ్యమిచ్చే ఛాన్స్ ఉంది.

వైజాగ్ స్టేడియం (x/andhra_cricket)

తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. విశాఖపట్నంలోనే ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతోంది. ఈ ఏడాది భారత్ హోస్ట్ గా నిర్వహించే వుమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా ఓ మ్యాచ్ తో పాటు ఓపెనింగ్ సెర్మనీకి వైజాగ్ స్టేడియం వేదికగా నిలవనుంది. శనివారం (మార్చి 22) కోల్ కతాలో జరిగిన బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఈ మేరకు చర్చించినట్లు తెలిసింది.

నాలుగోసారి

మహిళల వన్డే ప్రపంచకప్ కు భారత్ నాలుగోసారి ఆతిథ్యమివ్వబోతోంది. 1978, 1997, 2003 లో కూడా వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ భారత్ లోనే జరిగింది. ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత మరోసారి ఈ మెగా టోర్నీకి ఇండియా హోస్ట్ గా నిలవబోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ఈ ప్రపంచకప్ జరిగే అవకాశముంది.

మొత్తం అయిదు వేదికల్లో మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో వైజాగ్ లో ఓపెనింగ్ సెర్మనీతో పాటు తొలి మ్యాచ్ నిర్వహించే ఛాన్స్ ఉంది. ముల్లాన్ పూర్, ఇండోర్, తిరువనంతపురం, గువాహతి ఇతర వేదికలుగా షార్ట్ లిస్ట్ చేశారు. ఈ మెగా టోర్నీ మూడు వారాల పాటు సాగుతుంది.

వైజాగ్ లో క్రికెట్

వైజాగ్ లో స్టేడియంలో రాబోయే నెలల్లో ఎక్కువ క్రికెట్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇక్కడ రెండు మ్యాచ్ లు ఆడనున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ టెస్టు, ఐపీఎల్ వేదికగా మారిన వైజాగ్.. ఈ ఏడాది టీమిండియా ఆడబోయే ఓ వన్డేకు కూడా ఆతిథ్యమిచ్చే అవకాశముంది.

సౌతాఫ్రికాతో వన్డే

వైజాగ్ లోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో అంతర్జాతీయ వన్డే జరగబోతోంది. ఈ ఏడాది నవంబర్ లో మొదలయ్యే సిరీస్ లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ టూర్ లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, అయిదు టీ20లు జరుగుతాయి. రెండో టెస్టు గువాహటిలోని బార్సాపారా స్టేడియంలో నిర్వహిస్తారు. ఈ వేదికలో జరగబోయే మొట్టమొదటి టెస్టు ఇదే. ఆ తర్వాత వన్డే సిరీస్ లో భాగంగా వైజాగ్ లో డిసెంబర్ 3న వన్డే మ్యాచ్ ఫ్యాన్స్ ను అలరించనుంది.

జోనల్ సిస్టమ్

భారత దేశవాళీ క్రికెట్లో జోనల్ సిస్టమ్ ను మళ్లీ తీసుకురాబోతున్నారు. ఆరు జోన్లు తలపడతాయి. ఈ డొమెస్టిక్ సీజన్ లో దులీప్ ట్రోఫీని మొదట నిర్వహిస్తారు. అంతే కాకుండా స్కోరర్స్ కు పేమేంట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఒక డొమెస్టిక్ మ్యాచ్ కు ప్రతి స్కోరర్ రూ.15 వేలు పొందుతారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం