విరాట్ కోహ్లి రిటైర్మెంట్? షాక్ ఇవ్వనున్న స్టార్ బ్యాటర్.. టెస్టు క్రికెట్ కు గుడ్ బై.. ఇప్పుడే వద్దన్న బీసీసీఐ!-virat kohli to follow rohit sharma as plan for test cricket retirement but bcci asked him to continue for england series ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  విరాట్ కోహ్లి రిటైర్మెంట్? షాక్ ఇవ్వనున్న స్టార్ బ్యాటర్.. టెస్టు క్రికెట్ కు గుడ్ బై.. ఇప్పుడే వద్దన్న బీసీసీఐ!

విరాట్ కోహ్లి రిటైర్మెంట్? షాక్ ఇవ్వనున్న స్టార్ బ్యాటర్.. టెస్టు క్రికెట్ కు గుడ్ బై.. ఇప్పుడే వద్దన్న బీసీసీఐ!

రోహిత్ శర్మ లాగే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లే కనిపిస్తున్నాడు. టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో కోహ్లి ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడే రిటైర్ కావొద్దని బీసీసీఐ కోహ్లీని ఆపుతోందని సమాచారం.

విరాట్ కోహ్లి (AFP)

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లాగే విరాట్ కోహ్లి కూడా ఫ్యాన్స్ కు షాకిచ్చేందుకు రెడీ అవుతున్నాడా? టెస్టులకు గుడ్ బై చెప్పబోతున్నాడా? అంటే బీసీసీఐ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వస్తున్నాయి. టెస్టు క్రికెట్ ను ముగించేందుకు కోహ్లి ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి కూడా చెప్పాడని తెలిసింది. కానీ ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని వారించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోందని టాక్.

బీసీసీఐకి చెప్పేసిన కోహ్లి

టెస్టుల నుంచి రిటైర్ కావాలనే తన కోరికను విరాట్ కోహ్లి భారత క్రికెట్ బోర్డుకు తెలియజేశాడని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. అయితే ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని బీసీసీఐ సీనియర్ అధికారులు రిక్వెస్ట్ చేశారని పేర్కొంది. ‘‘టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లి బోర్డుకు తెలియజేశాడు. కానీ కీలకమైన ఇంగ్లాండ్ టూర్ రానుండటంతో పునరాలోచించాలని బీసీసీఐ కోరింది. ఈ అభ్యర్థనపై కోహ్లి ఇంకా స్పందించలేదు’’ అని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదిక పేర్కొంది.

వరుస షాక్ లు

ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలకడం భారత క్రికెట్ ను కుదిపేసింది. సడెన్ గా టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు రోహిత్. మే 7న ఈ షాకింగ్ డిసిషన్ వెల్లడించాడు. ఇప్పుడు కోహ్లి కూడా గుడ్ బై చెప్తే సీనియర్లు లేని జట్టుగా టీమిండియా మారిపోతుంది. పైగా ఇంగ్లాండ్ తో కీలకమైన టెస్టు సిరీస్ రాబోతోంది. జూన్ 2న ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ఇంగ్లాండ్ టూర్ లో కోహ్లి కూడా లేకపోతే టీమ్ పై తీవ్ర ప్రభావం పడుతుంది.

గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లి ఒకేసారి టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఈ దిగ్గజ ఆటగాళ్లు ఒకేసారి టెస్టులను వదిలేసే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ సిరీస్ కోసం

టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ న్యూస్ ను కోహ్లి చెప్పగానే బీసీసీఐ షాక్ అయినట్లు సమాచారం. కానీ ఇంగ్లాండ్ తో సిరీస్ కోసమైనా రిటైర్మెంట్ వాయిదా వేసుకోవాలని బీసీసీఐ కోహ్లీని కోరినట్లు తెలిసింది. కానీ దీనిపై కోహ్లి ఇంకా రియాక్ట్ కాలేదు. దీంతో కోహ్లి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కొంతకాలంగా టెస్టు క్రికెట్లో కోహ్లి కీలకంగా మారాడు. అతని కోసమే టెస్టులు చూసేందుకు ప్రేక్షకులు స్టేడియాలకు వస్తారంటే అతిశయోక్తి కాదు. పైగా కోహ్లికి ఈ ఫార్మాట్ అంటే ఎంతో ప్రేమ.

విరాట్ లేకపోతే

రోహిత్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఇప్పుడు కోహ్లి కూడా లేకపోతే ఇంగ్లాండ్ టూర్ లో భారత్ కు ఇబ్బందులు తప్పవు. కోహ్లి దూరమైతే.. టీమిండియా టెస్టు టీమ్ లో కేఎల్ రాహుల్ (58 టెస్టులు) మిగిలిన ఏకైక సీనియర్ ఆటగాడిగా ఉంటాడు. కోహ్లి 123 టెస్టులాడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం