ఏప్రిల్ 10, 2025.. ఐపీఎల్ 18లో బెంగళూరులో ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఢిల్లీని గెలిపించిన లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ ‘ఇది నా గ్రౌండ్’ అంటూ కాంతారా స్టైల్లో చేసుకున్న సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. కట్ చేస్తే..
ఏప్రిల్ 29,2025.. ఇదే ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను దాని హోం గ్రౌండ్ లోనే ఆర్సీబీ చిత్తుచేసింది. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత కేఎల్ రాహుల్ కు దగ్గరకు వచ్చి ‘ఇది నా గ్రౌండ్’ అంటూ విరాట్ కోహ్లి వేసిన సెటైర్ ఇప్పుడు ఇంటర్నెట్ ను ఊపేస్తోంది.
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్న కేఎల్ రాహుల్ స్వస్థలం బెంగళూరు అన్న సంగతి తెలిసిందే. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఢిల్లీ నుంచి వచ్చాడన్నది తెలిసిందే. అలాంటిది ఈ ఆటగాళ్లు తమ జట్ల తరపున పుట్టిన చోట వేరే ఫ్రాంఛైజీలపై అదరగొట్టి సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీపై బెంగళూరులో కేఎల్.. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఢిల్లీలో కోహ్లి అదరగొట్టారు.
ఆదివారం (ఏప్రిల్ 27) అరుణ్ జైట్లీ స్టేడియంలో విరాట్ కోహ్లీ సంబరాలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ పై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు కేఎల్ రాహుల్ కు కోహ్లి సెటైర్ వేశాడు. మ్యాచ్ ముగిశాక రాహుల్ వద్దకు వెళ్లిన కోహ్లీ.. ‘ఇది నా గ్రౌండ్’ అంటూ మైదానంలో సర్కిల్ గీసి చూపించాడు.
కేఎల్ రాహుల్ చేసుకున్న సెలబ్రేషన్ ను ఇప్పుడు కోహ్లి రీక్రియేట్ చేశాడు. అయితే ఇది సరదాకు చేసింది మాత్రమే. వెంటనే విరాట్ కోహ్లి పెవిలియన్ వైపు కేఎల్ వేలు చూపించాడు. ఇది కోహ్లి మైదానం అనే అర్థం వచ్చేలా కేఎల్ అలా చేశాడు. దీంతో ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు హగ్ చేసుకుని నవ్వుకున్నారు. అంతకుముందు మ్యాచ్ లో కేఎల్, కోహ్లి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్లో పాయింట్ల టేబుల్ లో ఆర్సీబీ టాప్ ప్లేస్ కు చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 10 మ్యాచ్ ల్లో ఆర్సీబీకి ఇది ఏడో విక్టరీ. ఇందులో ఆరు అపోనెంట్ గ్రౌండ్స్ లోనే వచ్చాయి. ఓ ఐపీఎల్ ఎడిషన్ లో ప్రత్యర్థి స్టేడియాల్లో ఓ టీమ్ సాధించిన అత్యధిక విజయాలు ఇవే.
163 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీ 47 బంతుల్లో 51 పరుగులు, కృనాల్ పాండ్యా 47 బంతుల్లో అజేయంగా 73 పరుగులు చేశారు. ఆర్సీబీ మరో 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
సంబంధిత కథనం