Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..-virat kohli picks ab de villiers and jasprit bumrah and 2 others in his gully cricket team ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

Sharath Chitturi HT Telugu
Updated May 18, 2024 10:21 AM IST

Virat Kohli gully cricket team : విరాట్​ కోహ్లీ.. తన గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు టాప్​ ప్లేయర్స్​ని పిక్​ చేసుకున్నాడు. వారి పేర్లను ఇక్కడ చూద్దాము..

విరాట్​ కోహ్లీ..
విరాట్​ కోహ్లీ.. (AFP)

Virat Kohli gully cricket team : ఇప్పుడు క్రికెట్​ లవర్స్​ అందరు.. ఐపీఎల్​ 2024 రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు వర్సెస్​ చెన్నై సూపర్​ కింగ్స్​ మ్యాచ్​ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మ్యాచ్​కి ముందు.. తన ఎక్స్​ప్లోజివ్​ గల్లీ క్రికెట్​ టీమ్​ని పిక్​ చేసుకున్నాడు ఆర్సీబీ స్టార్​ ప్లేయర్​ విరాట్​ కోహ్లీ! 'మీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురిని పిక్​ చేసుకోవాలంటే.. ఎవరిని ఎంచుకుంటారు?' అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..

విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​ ఇదే..

"మీ గల్లీ క్రికెట్​ టీమ్​ కోసం మీతో పాటు ఇంకో నలుగురిని ఎంచుకోండి. ఆ టీమ్​లో ఒక వికెట్​ కీపర్​, ఒక బౌలర్​, ఒక బ్యాటర్​ ఉండాలి" అన్న ప్రశ్నకు బాగా ఆలోచించిన కోహ్లీ.. "నేను ఏబీ డి విలియర్స్​, జస్ప్రీత్​ బుమ్రా, ఆండ్రూ రసెల్​, రషీద్​ ఖాన్​లను ఎంచుకుంటాను," అని జవాబిచ్చాడు.

ఈ నలుగు ప్లేయర్స్​ కూడా నాలుగు వేరువేరు ఫ్రాంఛైజ్​లకు చెందినవారే. పైగా వీరందరు స్టార్​ ప్లేయర్సే. ఏబీడీ- ఆర్సీబీ తరఫున అనేక ధనాధన్​ ఇన్నింగ్స్​లు ఆడాడు. ఆల్​ రౌండర్​ ఆండ్రూ రసెల్​ విధ్వంసం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లదు. జస్ప్రీత్​ బుమ్రా, రషీద్​ ఖాన్​లు వరల్డ్​ క్లాస్​ టాప్​ బౌలర్లు!

Virat Kohli IPL 2024 : ఇక ఐపీఎల్​ 2024 విషయానికొస్తే.. విరాట్​ కోహ్లీ పరుగుల వరద కొనసాగుతోంది. 13 మ్యాచ్​లలో 661 రన్స్​ చేసి ఐపీఎల్​ 2024 ఆరెంజ్​ క్యాప్​ రేస్​లో మొదటి స్థానంలో ఉన్నాడు కోహ్లీ. అతని స్ట్రైక్​ రేట్​ 155. మరీ ముఖ్యంగా.. గత కొన్ని మ్యాచ్​లలో అయితే.. ధనాధన్​ ఇన్నింగ్స్​లు ఆడుతూ.. తన స్ట్రైక్​ రేట్​ని విమర్శిస్తున్న వారికి గట్టు జవాబిచ్చాడు.

ఆర్సీబీ వర్సెస్​ సీఎస్కే.. ప్లేఆఫ్స్​కి చేరేదెవరు?

ఐపీఎల్ 2024​లో మరో రసవత్తర సమరానికి సమయం ఆసన్నమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా.. శనివారం రాత్రి 7:30 నిమిషాలకు చెన్నై సూపర్​ కింగ్స్​తో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు తలపడనుంది. సాధారణంగానే.. ఈ రెండు జట్లు పోటీపడుతుంటే.. ఫ్యాన్స్​లో భారీ అంచనాలు ఉంటాయి. అలాంటిది.. ఐపీఎల్​ 2024 ప్లేఆఫ్స్​ కోసం ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్​ అత్యంత కీలకం మారడంతో.. హైఓల్టేజ్​ యాక్షన్​ తప్పదని క్రికెట్​ లవర్స్​ భావిస్తున్నారు. అంత బాగానే ఉంది కానీ.. ఆర్సీబీ వర్సెస్​ సీఎస్కే మ్యాచ్​కి వర్షం ముప్పు పొంచి ఉండటమే ఐపీఎల్​ ఫ్యాన్స్​ని ఆందోళనకు గురి చేస్తోంది. మరి.. వర్షం వల్ల మ్యాచ్​ జరగకపోతే? ఐపీఎల్​ 2024లో సీఎస్కే, ఆర్సీబీ ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

Virat Kohli latest news : రుతురాజ్​ గైక్వాడ్​ కెప్టెన్సీలో సీఎస్కే ఇప్పటివరకు 13 మ్యాచ్​లు ఆడి.. 7 గెలిచి, 6 ఓడిపోయింది. పాయింట్లు 14. ఇక ఫాఫ్​ డూప్లెసిస్​ నేతృత్వంలోని ఆర్సీబీ.. 6 విజయాలు, 7 పరాజయాలతో మొత్తం 12 పాయింట్స్​ సంపాదించుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం