పద్నాలుగేళ్ల క్రితం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2011 టైటిల్ను భారత్ కైవసం చేసుకోవడం దేశ క్రికెట్ చరిత్రలోనే అత్యంత భావోద్వేగ క్షణాల్లో ఒకటిగా నిలిచింది. అప్పటి విజేత జట్టు నుంచి మొత్తంగా 15 మంది క్రికెటర్స్ అన్ని రకాల ఆటల నుంచి వీడ్కోలు పలికారు.
రీసెంట్గా పీయూష్ చావ్లా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో 15 మందితో కూడిన ఆ జట్టు ఇప్పుడు క్రికెట్లో లేకపోయింది. అయితే, ఒకే ఒక్కడు మాత్రం ఇప్పటికీ భారత జట్టులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. వన్డే క్రికెట్లో ఆ 36 ఏళ్ల స్టార్ బ్యాట్స్మెన్ దూసుకుపోతున్నాడు.
అతను ఎవరో కాదు కింగ్ విరాట్ కోహ్లీ. 2011 వరల్డ్ కప్లో టీమిండియా జట్టులో అత్యంత యువ ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. అప్పటి నుంచి భారత క్రికెట్లో ఓ శక్తిగా మారాడు. వరల్డ్ కప్లో పెద్దగా ఎక్స్పీరియెన్స్ లేని విరాట్ కోహ్లీ తన మొదటి మ్యాచ్లో సెంచరీ కొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు.
అప్పటి నుంచి పరుగుల కింగ్గా, చేజింగ్ మాస్టర్గా ఇండియన్ క్రికెట్కు బ్రాండ్ అయ్యాడు. ఇదిలా ఉంటే, మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో చారిత్రాత్మక ప్రపంచ కప్ విజేగా నిలిచిన భారత జట్టులో సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా వంటి దిగ్గజాలు ఎప్పుడో ఆటకు దూరమయ్యారు.
అలాగే, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, హర్భజన్ సింగ్, శ్రీశాంత్, యూసుఫ్ పఠాన్, ప్రవీణ్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్ అంతా రిటైర్మెంట్ ప్రకటించారు. వీరిలో కొందరు కోచ్లుగా, వ్యాఖ్యాలలుగా కొనసాగుతున్నారు. ఇక ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఐపీఎల్లో సీఎస్కేకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.
ఇక రీసెంట్గా జూన్ 6న పీయుష్ చావ్లా రిటైర్మెంట్ ప్రకటించాడు. స్పిన్నర్గా చేరిన పీయూష్ చావ్లా కెరీర్లో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. ఐపీల్లో అత్యధిక వికెట్స్ తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఇక పీయుష్ చావ్లా వీడ్కోలుతో 2011 ప్రపంచకప్ జట్టు గెలిచిన టీమిండియా నుంచి 15 మంది రిటైర్ అయ్యారు.
వీరందరిలో ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే మిగిలాడు. అయితే, టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ వన్డేల్లో కొనసాగుతాడు. దీంతో 2011 వరల్డ్ కప్ టీమిండియా జట్టు నుంచి ఇప్పటికీ క్రికెట్లో యాక్టివ్గా ఉన్న ఒకే ఒక్క ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.
సంబంధిత కథనం