టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే భార్యతో కలిసి తన ఫేవరెట్ స్వామీజీని కలిసిన విరాట్ కోహ్లి-virat kohli anushka sharma visits to swamy premanand govind sharan ji a day after retirement ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే భార్యతో కలిసి తన ఫేవరెట్ స్వామీజీని కలిసిన విరాట్ కోహ్లి

టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే భార్యతో కలిసి తన ఫేవరెట్ స్వామీజీని కలిసిన విరాట్ కోహ్లి

Hari Prasad S HT Telugu

విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే తన ఫేవరెట్ స్వామీజీని కలవడానికి బృందావన్ వెళ్లాడు. భార్య అనుష్క శర్మతో కలిసి అక్కడి ఆశ్రమంలో కోహ్లి ఉన్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే భార్యతో కలిసి తన ఫేవరెట్ స్వామీజీని కలిసిన విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు మరోసారి ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. సోమవారం (మే 12) కోహ్లి టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరుసటి రోజే ఈ దంపతులు తాము ఎంతగానో విశ్వసించే బృందావన్ లోని స్వామీ ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహారాజ్ ను కలవడానికి వెళ్లడం విశేషం.

బృందావన్‌లో కోహ్లి, అనుష్క

విరాట్ కోహ్లి, అనుష్క ఇద్దరూ దేవుడిని బలంగా నమ్ముతారు. సమయం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా బృందావన్ లోని ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ ఆశ్రమానికి వెళ్తుంటారు. తాజాగా తాను టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా కోహ్లి, అనుష్క దంపతులు అక్కడికే వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమ పిల్లలు వామికా, అకాయ్ లతో కలిసి కోహ్లి, అనుష్క ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ స్వామీజీ ముందు వీళ్లు మోకరిల్లడం కూడా ఈ ఫొటోల్లో చూడొచ్చు. ఈ ఆశ్రమానికి వీళ్లు గతంలోనూ చాలాసార్లు వచ్చారు. స్వామీజీ సత్సంగ్‌లకు హాజరవుతూ ఉంటారు. తమ జీవితంలో ఏ ముఖ్యమైన సందర్భం వచ్చినా కూడా ఈ ఇద్దరూ ఈ ఆశ్రమానికి వెళ్లి స్వామీజీ ఆశీర్వాదం తీసుకుంటారు. సామాన్య భక్తుల్లాగే వీళ్లు అక్కడికి వెళ్తే ఎంతో భక్తిపారవశ్యంలో మునిగి తేలుతారు.

టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే కోహ్లి భార్య అనుష్కతో కలిసి ఎయిర్‌పోర్టులో కనిపించాడు. అతడు ఇప్పుడిలా బృందావన్ లో కనిపించి ఆశ్చర్యపరిచాడు.

విరాట్ కోహ్లి రిటైర్మెంట్

విరాట్ కోహ్లి టెస్టులకు కూడా గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. గతేడాది టీ20ల నుంచి తప్పుకున్న అతడు.. తాజాగా సాంప్రదాయ ఐదు రోజుల క్రికెట్ నుంచి కూడా వైదొలిగాడు. దీంతో కేవలం వన్డే క్రికెట్ లోనే అతడు కొనసాగనున్నాడు. 14 ఏళ్లుగా టెస్టుల్లో కొనసాగిన అతడు 30 సెంచరీలు, 9 వేలకుపైగా పరుగులు చేయడం విశేషం.

ప్రస్తుతం కోహ్లి ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఆర్సీబీ ఈ సీజన్లో టాప్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇండోపాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అర్ధంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్.. మళ్లీ శనివారం (మే 17) నుంచి ప్రారంభం కాబోతోంది. ఆ రోజు ఆర్సీబీ, కేకేఆర్ తలపడబోతున్నాయి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం