లండన్ వీధుల్లో.. వింబుల్డన్ కోర్టులో.. ఎంజాయ్ చేస్తున్న కోహ్లి, అనుష్క.. లవ్ జంట అదిరిందంటూ కామెంట్లు-virat kohli and anushka sharma virushka pain in wimbledon 2025 london watching djokovic match ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  లండన్ వీధుల్లో.. వింబుల్డన్ కోర్టులో.. ఎంజాయ్ చేస్తున్న కోహ్లి, అనుష్క.. లవ్ జంట అదిరిందంటూ కామెంట్లు

లండన్ వీధుల్లో.. వింబుల్డన్ కోర్టులో.. ఎంజాయ్ చేస్తున్న కోహ్లి, అనుష్క.. లవ్ జంట అదిరిందంటూ కామెంట్లు

వింబుల్డన్ 2025లో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ తళుక్కుమని మెరిశారు. టెన్నిస్ లెజెండ్ జకోవిచ్ మ్యాచ్ ను చూస్తూ ఎంజాయ్ చేశారు. విరుష్క జోడీ లండన్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే.

వింబుల్డన్ మ్యాచ్ వీక్షిస్తున్న విరాట్ కోహ్లి, అనుష్క శర్మ (AFP )

వింబుల్డన్ 2025 టోర్నీలో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ తళుక్కుమని మెరిశారు. టెన్నిస్ లెజెండ్ నొవాక్ జకోవిచ్ మ్యాచ్ ను లైవ్ గా చూశారు. ఈ మ్యాచ్ కు విరుష్క జోడీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. విరాట్, అనుష్క లండన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. లండన్ వీధుల్లో స్వేచ్ఛగా చక్కర్లు కొడుతుండటంతో పాటు టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లవ్ జంట అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

జకోవిచ్ మ్యాచ్

జకోవిచ్, ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ డి మినార్ మధ్య జరిగిన వింబుల్డన్ పురుషుల రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌కు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ హాజరయ్యారు. గత సంవత్సరం వింబుల్డన్ ఫైనలిస్ట్ జకోవిచ్ ఈ మ్యాచ్ లో తొలి సెట్లో 1-6 తేడాతో ఓడిపోయినా తిరిగి పుంజుకుని మ్యాచ్ గెలిచాడు. భారత్, ఇంగ్లాండ్ అయిదు టెస్టుల సిరీస్ లో కోహ్లి ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ కోహ్లి సడన్ గా టెస్టు రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు.

ఐపీఎల్ టైటిల్

జూన్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తన తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్‌ను గెలుచుకున్న కోహ్లీ, టోర్నమెంట్ తర్వాత తన కుటుంబంతో సమయం గడపడానికి లండన్‌కు వెళ్లాడు. విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ లో అరుదుగా పోస్టులు పెడుతుంటాడు. శనివారం అతను భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కోసం ఒక కథనాన్ని పోస్ట్ చేశాడు.

గిల్ ఇంగ్లాండ్‌తో జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో 430 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం రెండు రోజుల తర్వాత జకోవిచ్, డిమినార్ మధ్య జరిగే యాక్షన్‌ను భార్య అనుష్కతో కలిసి కోహ్లి చూశాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ స్టోరీ పోస్టు చేశాడు.

విరాట్ కోహ్లి స్టోరీ
విరాట్ కోహ్లి స్టోరీ (Virat Kohli Instagram)

మ్యాచ్ ఇలా

జకోవిచ్, డిమినార్ మ్యాచ్ లో జకో విజయం సాధించాడు. జకోవిచ్ 1-6, 6-4, 6-4, 6-4 తేడాతో మ్యాచ్ గెలుచుకున్నాడు. తన కెరీర్‌లో తొలిసారిగా జకోవిచ్ వింబుల్డన్‌లో మొదటి సెట్‌ను 1-6 తేడాతో కోల్పోయాడు. ఈ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌కు జో రూట్, రోజర్ ఫెదరర్, జేమ్స్ ఆండర్సన్ కూడా హాజరయ్యారు.

కోహ్లీ ఇప్పుడు టెస్టులు, టీ20ల నుంచి రిటైరయ్యాడు. అతను 50 ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రమే ఆడతాడు. అక్కడ అతను అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం