విరాట్ కోహ్లి అంటేనే దూకుడుకు మారుపేరు. ప్రత్యర్థి ఆటగాళ్లు తన ముందు తోక జాడిస్తే కోహ్లి ఊరుకోడు. గెలిచి మరీ రివేంజ్ తీసుకుంటాడు. ఐపీఎల్ 2025లో ఆదివారం (ఏప్రిల్ 20) పంజాబ్ కింగ్స్ పై గెలిచిన తర్వాత కోహ్లి అదే చేశాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను చూస్తూ ఓ రేంజ్ లో సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఆ తర్వాత హ్యాండ్ షేక్ సమయంలో ఈ ఇద్దరి మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఐపీఎల్ 2025లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీని పంజాబ్ ఓడించింది. అప్పుడు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ కూడా ఓ రేంజ్ లో విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. అది గుర్తు పెట్టుకున్న కోహ్లి ఇప్పుడు పంజాబ్ హోం గ్రౌండ్ లో ఆ టీమ్ పై గెలుపును అంతకంటే ఎక్కువ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు. దెబ్బకు దెబ్బ తీశామనేలా కనిపించాడు.
జితేశ్ సిక్సర్ తో మ్యాచ్ ముగించగానే శ్రేయస్ ను చూస్తూ విరాట్ సంబరాలు చేసుకున్నాడు. శ్రేయస్ ను ట్రోల్ చేసినట్లు కనిపించింది. ఇది అతనికి నచ్చలేదు. అందుకే మ్యాచ్ ముగిశాక షేక్ హ్యాండ్ సమయంలో శ్రేయస్ సీరియస్ గా కనిపించాడు. కోహ్లి నవ్వుతూ పరిస్థితిని కామ్ చేసేందుకు ట్రై చేసినా.. శ్రేయస్ ఏదో మాట్లాడాడు. కానీ కోహ్లి పట్టించుకోకుండా నవ్వుతూనే వెళ్లిపోయాడు.
పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లి చెలరేగాడు. హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచి మ్యాచ్ ను గెలిపించాడు. దేవ్ దత్ పడిక్కల్ కూడా చెలరేగడంతో 157 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు మిగిలి ఉండగానే ఆర్సీబీ అందుకుంది. 54 బంతుల్లో 73 పరుగులతో నాటౌట్ గా నిలిచిన కోహ్లి.. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లి అగ్రెసెవ్ గానే కనిపించాడు. పంజాబ్ బ్యాటింగ్ సమయంలో నేహాల్ వధేరాను రనౌట్ చేసిన తర్వాత కోహ్లి ఇచ్చిన సెండాఫ్ వైరల్ గా మారింది. ఇక ఛేజింగ్ లో పంజాబ్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ తోనూ కోహ్లి సంభాషణ హాట్ టాపిక్ గా మారింది. పంజాబీలో అతనితో మాట్లాడాడు.
ఏది ఏమైనప్పటికీ పంజాబ్ పై విజయంతో ఆర్సీటీ తిరిగి పాయింట్ల టేబుల్ లో టాప్-4లోకి వచ్చింది.
సంబంధిత కథనం