Team India Schedule: బంగ్లాదేశ్ టూర్‌కు టీమిండియా.. పూర్తి షెడ్యూల్ అనౌన్స్ చేసిన బీసీసీఐ-team india schedule india vs bangladesh bcci announces full schedule details ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India Schedule: బంగ్లాదేశ్ టూర్‌కు టీమిండియా.. పూర్తి షెడ్యూల్ అనౌన్స్ చేసిన బీసీసీఐ

Team India Schedule: బంగ్లాదేశ్ టూర్‌కు టీమిండియా.. పూర్తి షెడ్యూల్ అనౌన్స్ చేసిన బీసీసీఐ

Hari Prasad S HT Telugu

Team India Schedule: టీమిండియా ఈ ఏడాది బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ మంగళవారం (ఏప్రిల్ 15) అనౌన్స్ చేసింది. మరి ఆ టూర్ షెడ్యూల్ ఎలా ఉందో చూడండి.

బంగ్లాదేశ్ టూర్‌కు టీమిండియా.. పూర్తి షెడ్యూల్ అనౌన్స్ చేసిన బీసీసీఐ (REUTERS)

Team India Schedule: ఇండియన్ క్రికెట్ టీమ్ ఈ ఏడాది బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఐపీఎల్, ఇంగ్లండ్ టూర్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ లో వన్డే, టీ20 సిరీస్ ఆడటానికి టీమిండియా వెళ్లనున్నట్లు బీసీసీఐ తాజాగా రిలీజ్ చేసిన షెడ్యూల్ చూస్తే స్పష్టమవుతోంది. ఆగస్టులో ఈ టూర్ జరగనుంది.

బంగ్లాదేశ్‌లో టీమిండియా షెడ్యూల్

టీమిండియా ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్నట్లు బీసీసీఐ మంగళవారం (ఏప్రిల్ 15) అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడుతుంది. ఆగస్ట్ 17న ఈ టూర్ మొదలవుతుంది. మొదట మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఆ తర్వాత మూడు టీ20ల సిరీస్ ఆడతారు.

ఆగస్ట్ 17న మిర్పూర్ లోని షేరే బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో తొలి వన్డే జరుగుతుంది. ఆ తర్వాత ఆగస్ట్ 20న అక్కడే రెండో వన్డే ఆడతారు. ఆగస్ట్ 23న చట్టోగ్రామ్ లో మూడో వన్డే జరుగుతుంది.

ఇక ఆగస్ట్ 26 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభమవుతుంది. చట్టోగ్రామ్ లోనే తొలి టీ20 జరగనుంది. ఆ తర్వాత ఆగస్ట్ 29న మిర్పూర్ లో రెండో టీ20, ఆగస్ట్ 31న అక్కడే మూడో టీ20 జరుగుతాయి. ఈ షెడ్యూల్ ను బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

ఇండియా, బంగ్లాదేశ్ సిరీస్ షెడ్యూల్

మొదటి వన్డే: ఆగస్టు 17 (ఆదివారం) – ఎస్‌బీఎన్‌సీఎస్, మిర్పూర్

రెండో వన్డే: ఆగస్టు 20 (బుధవారం) – ఎస్‌బీఎన్‌సీఎస్, మిర్పూర్

మూడో వన్డే: ఆగస్టు 23 (శనివారం) – బీఎస్‌ఎస్‌ఎఫ్‌ఎల్‌ఎంఆర్‌సీ, చట్టోగ్రామ్

మొదటి టీ20: ఆగస్టు 26 (మంగళవారం) – బీఎస్‌ఎస్‌ఎఫ్‌ఎల్‌ఎంఆర్‌సీ, చట్టోగ్రామ్

రెండో టీ20: ఆగస్టు 29 (శుక్రవారం) – ఎస్‌బీఎన్‌సీఎస్, మిర్పూర్

మూడో టీ20: ఆగస్టు 31 (ఆదివారం) – ఎస్‌బీఎన్‌సీఎస్, మిర్పూర్

బిజీబిజీగా టీమిండియా

ఈ ఏడాది టీమిండియా బిజీబిజీగా గడపనుంది. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడింది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడింది. అది ముగిసిన కొన్ని రోజులకే ఐపీఎల్ ప్రారంభమైంది. ఈ మెగా లీగ్ ముగిసిన తర్వాత ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇండియన్ టీమ్ ఇంగ్లండ్ కు వెళ్లనుంది.

ఈ టూర్ జూన్ నుంచి ఆగస్ట్ వరకు సాగనుంది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే బంగ్లాదేశ్ టూర్ కు వెళ్తుంది. సెప్టెంబర్ లో ఆసియా కప్ ఆడాల్సి ఉంది. అక్టోబర్ లో వెస్టిండీస్ టీమ్ ఇండియాకు వస్తుంది. ఆ వెంటనే సౌతాఫ్రికా సిరీస్ ఉంటుంది. ఆ తర్వాత ఇండియన్ టీమ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. అక్కడ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం