మరోసారి సస్పెన్స్ లో పెట్టిన ధోని.. వచ్చే సీజన్ ఆడతాడా? లేదా? కామెంట్లు వైరల్-suspense continues on ms dhoni retirement i dont know i am coming for the next game comments goes viral ipl 2025 csk ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  మరోసారి సస్పెన్స్ లో పెట్టిన ధోని.. వచ్చే సీజన్ ఆడతాడా? లేదా? కామెంట్లు వైరల్

మరోసారి సస్పెన్స్ లో పెట్టిన ధోని.. వచ్చే సీజన్ ఆడతాడా? లేదా? కామెంట్లు వైరల్

తన ఐపీఎల్ ఫ్యూచర్ పై ఎంఎస్ ధోని మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. వచ్చే సీజన్ లో ఆడతాడో లేదో అనే దానిపై క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ కొనసాగించాడు.

ధోని (AFP)

చెపాక్‌లో బుధవారం (ఏప్రిల్ 30) జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సంచలన కామెంట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ కు ముందు టాస్ సమయంలో ధోని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తన ఐపీఎల్ రిటైర్మెంట్ పై క్లారిటీ ఇవ్వని ధోని.. మరోసారి సస్పెన్స్ కొనసాగించాడు.

నాకే తెలియదు

హోం గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్ తో టాస్ సమయంలో ధోని మాట్లాడుతుండగా ఫ్యాన్స్ కేరింతలతో స్టేడియం దద్దరిల్లింది. దీంతో కామెంటేటర్ డాని మోరిసన్ ఓ ప్రశ్న వేశాడు. ఇలాంటి స్వాగతం తర్వాత వచ్చే సీజన్ కు తిరిగి వస్తారా? అని ధోనీని ప్రశ్నించాడు.

కానీ 43 ఏళ్ల ధోని మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తన ఐపీఎల్ ఫ్యూచర్ పై మరోసారి అనిశ్చితిని వ్యక్తం చేశారు. "నేను తదుపరి మ్యాచ్‌కు వస్తానా అనేది నాకే తెలియదు" అని మోరిసన్‌కు సమాధానం చెప్పిన తర్వాత ధోని నవ్వాడు. ఈ భారత మాజీ కెప్టెన్ తన కెరీర్ చివరి దశలో ఉన్నాడు. ఫిట్‌నెస్ ఆందోళనలు అతని భవిష్యత్తుపై సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఈ సీజన్‌లో ధోని.. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ కు ముందు వరకు 140 పరుగులు చేశారు. స్ట్రైక్ రేటు 142.86.

సీఎస్కే ఫెయిల్యూర్

ఐపీఎల్ 2025లో సీఎస్కే ఫెయిల్యూర్ కొనసాగుతోంది. 9 మ్యాచ్ ల్లో కేవలం రెండు మాత్రమే గెలిచిన ఆ టీమ్ పాయింట్ల పట్టికలో లాస్ట్ లో ఉంది. ఆ టీమ్ వరుసగా తమ చివరి నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించే ప్రమాదంలో ఉంది.

హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ గెలవడం గురించి అడిగినప్పుడు.. తన జట్టు ఆ ప్రయోజనాన్ని పొందడంలో విఫలమైందని ధోని అంగీకరించాడు. "అది ఓ గౌరవం. మనం చాలా మ్యాచ్‌లు హోమ్ గ్రౌండ్‌లో ఆడతాం. హోమ్ అడ్వాంటేజ్ చాలా ముఖ్యం. దాన్ని మేం ఉపయోగించుకోలేకపోయాం" అని ధోని తెలిపాడు.

రిటైర్మెంట్ ఊహాగానాలు

ఐపీఎల్ సీజన్ తోనే సీఎస్కేకు ధోని గుడ్ బై చెప్తాడని, లీగ్ ను వదిలేస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. చెపాక్ లోసీఎస్కే ఆడిన ఓ మ్యాచ్ కు ఎప్పుడూ లేనిది ధోని పేరెంట్స్ హాజరయ్యారు. ఇక ఈ సీజన్ లో ధోని ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. రుతురాజ్ గాయంతో ధోని సీఎస్కే కెప్టెన్ గా తిరిగి పగ్గాలు చేపట్టాడు. చివరగా టీమ్ ను ధోని నడిపిస్తున్నాడని, ఈ సీజన్ తోనే క్రికెట్ కు పూర్తిగా గుడ్ బై చెప్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం