అయిదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ 2025లో ఏదీ కలిసి రావడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ లో ఆ టీమ్ దారుణంగా విఫలమవుతోంది. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో దూరమవడంతో ఎంఎస్ ధోని కెప్టెన్ గా తిరిగొచ్చినా సీఎస్కే రాత మారడం లేదు. తాజాగా శుక్రవారం (ఏప్రిల్ 25) సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో సీఎస్కే ఓడింది. ఈ ఓటమితో ఓ స్టార్ హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది.
చెపాక్ లో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కు సెలబ్రిటీలు తరలి వచ్చారు. స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా ఆ మ్యాచ్ ను లైవ్ గా వీక్షించింది. సీఎస్కే టీమ్ ను ఆమె సపోర్ట్ చేసింది. ధోని క్రీజులోకి వస్తుంటే ఫ్యాన్ గర్ల్ లా మారి ఫోన్లో వీడియోలు తీసింది.
కానీ ఈ మ్యాచ్ లో సీఎస్కే తుస్సుమంది. 5 వికెట్ల తేడాతో చిత్తయింది. ఈ ఓటమిని తట్టుకోలేక శ్రుతి హాసన్ కన్నీళ్లు పెట్టుకుంది. స్టాండ్స్ లోనే ఒక్కసారిగా ఏడ్చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రుతి హాసన్ లాగే సీఎస్కే ఫ్యాన్స్ అందరూ బాధలో ఉన్నారనే కామెంట్లు వస్తున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కు సెలబ్రిటీలు తరలివచ్చారు. తమిళ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్, శివ కార్తీకేయన్ ఫ్యామిలీతో కలిసి ఈ మ్యాచ్ చూశారు. సీఎస్కేకు సపోర్ట్ చేశారు. కానీ వీళ్లకు నిరాశ తప్పలేదు. సీఎస్కే 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ చేతిలో ఓడింది. ఫస్ట్ సీఎస్కే 154 పరుగులకు ఆలౌటైంది. సన్ రైజర్స్ 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది.
ఐపీఎల్ 2025 పాయింట్ల టేబుల్ లో చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది. 9 మ్యాచ్ ల్లో 2 మాత్రమే గెలిచిన ఆ టీమ్.. 7 ఓడింది. 4 పాయింట్లు మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో పదో స్థానంలో ఉంది. ఆ టీమ్ ఇంకా 5 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లు అన్ని గెలిచినా ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరడం కష్టమే.
సంబంధిత కథనం