Rishabh Pant: అప్పుడు రాహుల్ - ఇప్పుడు పంత్ - ల‌క్నో ఫ్రాంచైజ్ ఓన‌ర్ ఖాతాలో మ‌రొక‌రు బ‌లి అంటూ ట్రోల్స్‌!-sanjiv goenka serious discussion with pant after lsg lost against dc in opening match cricket fans call kl rahul inciden ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rishabh Pant: అప్పుడు రాహుల్ - ఇప్పుడు పంత్ - ల‌క్నో ఫ్రాంచైజ్ ఓన‌ర్ ఖాతాలో మ‌రొక‌రు బ‌లి అంటూ ట్రోల్స్‌!

Rishabh Pant: అప్పుడు రాహుల్ - ఇప్పుడు పంత్ - ల‌క్నో ఫ్రాంచైజ్ ఓన‌ర్ ఖాతాలో మ‌రొక‌రు బ‌లి అంటూ ట్రోల్స్‌!

Nelki Naresh HT Telugu

Rishabh Pant: సోమ‌వారం జ‌రిగిన తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఓట‌మి పాలైంది. గెల‌వాల్సిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఓడిపోవ‌డంతో ఆ జ‌ట్టు ఫ్రాంచైజ్ ఓన‌ర్ సంజీవ్ గొయెంకా కెప్టెన్ పంత్‌కు వార్నింగ్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

రిషబ్ పంత్

సోమ‌వారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన ఆరంభ పోరులో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఒక వికెట్ తేడాతో ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్ స‌గానికిపైగా ల‌క్నోదే ఆధిప‌త్యం క‌నిపించింది. కానీ యంగ్ క్రికెట‌ర్లు అశోతోష్ శ‌ర్మ‌తో పాటు విప్ర‌జ్ నిగ‌మ్ సంచ‌ల‌న బ్యాటింగ్‌తో ఢిల్లీకి అనూహ్య విజ‌యాన్ని సాధించింది.మ‌రో మూడు మూడు బాల్స్ మిగిలుండ‌గానే ల‌క్నో విధించిన 210 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించారు.

వీడియో వైర‌ల్‌...

గెల‌వాల్సిన మ్యాచ్‌లో ల‌క్నో ఓడిపోవ‌డం ఆ జ‌ట్టు అభిమానుల‌తో పాటు ఫ్రాంచైజ్ ఓన‌ర్ సంజీవ్ గొయెంకా కూడా జీర్ణించుకోలేన‌ట్లుగా క‌నిపించింది. మ్యాచ్ అనంత‌రం సంజీవ్ గొయెంకాతో కెప్టెన్ రిష‌బ్ పంత్ మాట్లాడుతోన్న ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో దేని గురించి సంజీవ్ గొయెంకాకు సీరియ‌స్‌గా వివ‌రిస్తూ రిష‌బ్ పంత్ క‌నిపించాడు. ఈ వీడియోపై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతోన్నాయి.

సోష‌ల్ మీడియాలో...

అప్పుడే రిష‌బ్ పంత్‌కు క్లాస్ మొద‌లైందంటూ కామెంట్స్ చేస్తోన్నారు. గొయెంకా టీమ్‌కు ఎవ‌రు కెప్టెన్‌గా ఉన్నా ఇలాంటి వార్నింగ్‌లు త‌ప్ప‌వంటూ ఫ‌న్నీ మీమ్స్ సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తోన్నాయి. అప్పుడు రాహుల్‌, ఇప్పుడు పంత్ గొయెంకాకు బ‌ల‌య్యారంటూ చెబుతోన్నారు. బ్యాటింగ్‌లో, కెప్టెన్సీతో పాటు వికెట్ కీపింగ్‌లో అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా రాణించ‌లేక‌పోయినా రిష‌బ్ పంత్‌కు గొయెంకా వార్నింగ్ ఇచ్చిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా పంత్ బ్యాటింగ్ విష‌యంలో గొయెంకా అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

27 కోట్లు పెట్టి...

ఐపీఎల్ మెగా వేలంలో పంత్‌ను 27 కోట్లు పెట్టి ల‌క్నో టీమ్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్ట‌రీలోనే కాస్ట్‌లీ ప్లేయ‌ర్‌గా పంత్ నిలిచాడు. అన్ని కోట్లు పెట్టి కొంటే తొలి మ్యాచ్‌లోనే పంత్ డ‌కౌట్ అయ్యాడు. ఆరు బాల్స్ ఎదుర్కొన్న పంత్ ఒక్క ప‌రుగు కూడా చేయ‌కుండానే కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో పెవిలియ‌న్ చేరుకున్నాడు. అఖ‌రి ఓవ‌ర్‌లో మోహిత్ శ‌ర్మ స్టంప్ ఔట్ చేసే అవ‌కాశం పంత్‌కు వ‌చ్చింది. కానీ ఆ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడు. పంత్ త‌ప్పుల‌ను ఎత్తిచూపుతూ అత‌డికి గొయెంకా వార్నింగ్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

గ‌త ఏడాది ల‌క్నో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన కేఎల్ రాహుల్‌పై స్టేడియంలోనే ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశాడు సంజీవ్ గొయెంకా. అత‌డి తీరుపై అప్ప‌ట్లో విమ‌ర్శ‌లొచ్చాయి. ఆ త‌ర్వాత ల‌క్నో జ‌ట్టును వీడాడు రాహుల్‌. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ టీమ్ అత‌డిని కొనుగోలు చేసింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం