రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేసర్ యశ్ దయాల్పై గత శనివారం (జూన్ 30) ఘజియాబాద్కు చెందిన ఒక మహిళ సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, శారీరకంగా, మానసికంగా హింసించాడని ఆమె ఆరోపించింది. సీఎం ఆన్లైన్ ఫిర్యాదుల పోర్టల్ (IGRS) ద్వారా దాఖలు చేసిన ఫిర్యాదులో.. క్రికెటర్తో ఐదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నానని పేర్కొంది.
తాజాగా, సోమవారం (జూన్ 30) దైనిక్ భాస్కర్ రిపోర్టు ప్రకారం, యశ్ దయాల్ తనతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పలువురు మహిళలతో సంబంధాలు కొనసాగించాడని ఆమె ఆరోపించింది. "ఘజియాబాద్ పోలీసులు ఆమె స్టేట్మెంట్ను నమోదు చేసుకున్నారు. దయాల్కు నోటీసులు పంపారు" అని ఆ రిపోర్టు వెల్లడించింది.
వారి సంబంధాల వివరాలను కూడా ఈ రిపోర్టు బయటపెట్టింది. మొదట్లో సోషల్ మీడియా ద్వారా కలుసుకున్నారని, ఆ తర్వాత ప్రయాగరాజ్లో కలిశారని తెలిపింది. ఎడ్-టెక్ కంపెనీలో పనిచేసిన ఆ మహిళ.. తాను యశ్ ఇంట్లోనే ఉన్నానని, అతని కుటుంబానికి దగ్గరగా ఉన్నానని చెప్పింది. అయితే, దయాల్ తండ్రి మాత్రం ఆమె ఎవరో తెలియదని చెప్పినట్లు సమాచారం.
2022 ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా నరేంద్ర మోడీ స్టేడియంలో యశ్ కుటుంబంతో పాటు ఆమె కూడా ఉంది. ఆ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఆ తర్వాత, జూన్లో యశ్ సోదరి, ఒక స్నేహితుడితో కలిసి ఊటీకి వెళ్లారు. అక్కడ వెస్ట్రన్ వ్యాలీ రిసార్ట్లో బస చేశారు. ఇద్దరూ ఆ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
2025 ఫిబ్రవరిలో జరిగిన ఒక ఆర్సీబీ ఆటగాడి వివాహానికి కూడా తాము హాజరయ్యామని, అక్కడ నిశ్చితార్థం గురించి చర్చించుకున్నామని ఆ మహిళ పేర్కొంది. నాలుగున్నర సంవత్సరాల వారి సంబంధంలో క్రికెటర్ ఎన్నో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని ఆమె ఆరోపించింది. ఇప్పటి వరకూ నలుగురు అమ్మాయిలు బయటకు వచ్చి యశ్ తో తమకు సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారని సమాచారం.
"ఏప్రిల్ 17న, యశ్తో మాట్లాడుతున్న మరొక అమ్మాయి ఆమెను సంప్రదించి, అతని అక్రమ సంబంధాలకు సంబంధించిన ఆధారలను పంచుకుంది. యశ్ కుటుంబానికి ఇదంతా తెలిసినా, తనకు పెళ్లి ఆశలు చూపిస్తూ వచ్చారని ఆమె చెబుతోంది" అని ఆ రిపోర్టులో ఉంది. "మరో ముగ్గురు అమ్మాయిలు ఆమెను సంప్రదించి, ఇలాంటి అనుభవాలనే పంచుకున్నారు. యశ్ వారి ఫోన్లలో ఒకే యాప్ను గృహోపకరణాలు ఆర్డర్ చేయడానికి ఉపయోగించాడని ఆమె చెబుతోంది. జూన్ 7న లక్నోలోని ఒక హోటల్లో ఉండి, అభ్యంతరకరమైన వస్తువులను ఆర్డర్ చేసినట్లు ఆమె తెలుసుకుంది" అని కూడా దైనిక్ భాస్కర్ రిపోర్టు వెల్లడించింది.
ఘజియాబాద్ పోలీసులు యశ్ దయాల్కు నోటీసులు జారీ చేసినట్లు ధృవీకరించారు. అతడు తన స్టేట్మెంట్ను నమోదు చేయాల్సిందిగా స్పష్టం చేశారు. "ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి అధికారం, డబ్బు, హోదాను ఉపయోగిస్తున్నారు. కానీ నాకు చట్టంపై పూర్తి నమ్మకం ఉంది" అని దైనిక్ భాస్కర్ తో ఆ మహిళ చెప్పింది.
"నేను కావాలంటే దూరం అయి ఉండొచ్చు. కానీ అతను మోసం చేస్తున్నాడని నాకు ఎలా తెలుస్తుంది? అతను ఎప్పుడూ అలా కనిపించలేదు. నేను దేవుడికి వదిలేశాను, కానీ అతని కుటుంబం నా గురించి చెడుగా మాట్లాడటం ప్రారంభించినప్పుడు, నేను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను" అని కూడా ఆ యువతి తెలిపింది.
సంబంధిత కథనం