PSL Rohit Sharma Voice Over: సిగ్గులేని పాకిస్థాన్.. పీఎస్ఎల్ లో మస్కట్ కు రోహిత్ వాయిస్ ఓవర్.. ఫ్యాన్స్ ఫైర్-pakistan super league multan sultans muscat rohit sharma voice over controversy erupted fans fire on pak ipl 2025 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Psl Rohit Sharma Voice Over: సిగ్గులేని పాకిస్థాన్.. పీఎస్ఎల్ లో మస్కట్ కు రోహిత్ వాయిస్ ఓవర్.. ఫ్యాన్స్ ఫైర్

PSL Rohit Sharma Voice Over: సిగ్గులేని పాకిస్థాన్.. పీఎస్ఎల్ లో మస్కట్ కు రోహిత్ వాయిస్ ఓవర్.. ఫ్యాన్స్ ఫైర్

PSL Rohit Sharma Voice Over: పాకిస్థాన్ సూపర్ లీగ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వాయిస్ ఓవర్ వినిపించడం కలకలం రేపింది. ట్రోఫీని చూపిస్తూ మస్కట్ వాయిస్ ఓవర్ గా రోహిత్ గొంతు వినిపించింది. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది.

రోహిత్ శర్మ వాయిస్ ఓవర్ ను ఉపయోగించిన పాకిస్థాన్ సూపర్ లీగ్ టీమ్ (Files)

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025కు ముందు కొత్త వివాదం చెలరేగింది. పీఎస్ఎల్ ఫ్రాంఛైజీ ముల్తాన్ సుల్తాన్స్ టీమ్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియోపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇటు భారత్, అటు పాక్ ఫ్యాన్స్ ఈ పోస్టుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఫ్రాంఛైజీ అధికారిక మస్కట్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వాయిస్ ఓవర్ ను ఉపయోగించడమే ఇందుకు కారణం.

ట్రోఫీ పరిచయం

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన తర్వాత విలేకర్ల సమావేశంలో ట్రోఫీ గురించి రోహిత్ మాట్లాడాడు. ఇదెంతో ప్రత్యేకమైందని అన్నాడు. ఇప్పుడు అదే వాయిస్ ఓవర్ తో పీఎస్ఎల్ 2025 ట్రోఫీని ముల్తాన్ సుల్తాన్స్ మస్కట్ పరిచయం చేయడం కలకలం రేపింది. క్రీడా లీగ్ ల్లో మస్కట్ లు ఇలాంటి కామెంట్లు చేయడం కామనే. కానీ పాక్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పీఎస్ఎల్ ట్రోఫీకి రోహిత్ వాయిస్ వాడటమే ఇక్కడ వివాదానికి కారణమైంది.

సిగ్గుచేటు

ముల్తాన్ సుల్తాన్స్ సోషల్ మీడియోలో పోస్టు చేసిన ఈ వీడియోపై భారత్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఆ మస్కట్ బొద్దుగా ఉండటంతో కావాలనే రోహిత్ వాయిస్ ఓవర్ వాడి బాడీ షేమింగ్ చేస్తున్నారని రోహిత్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో రోహిత్ వాయిస్ వాడటానికి సిగ్గుండాలని పాకిస్థాన్ ను తీవ్రంగా తిడుతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ ను అవమానిస్తారా అంటూ మండిపడుతున్నారు.

పాక్ ఫ్యాన్స్ కూడా

మరోవైపు పాక్ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోపై ఫైర్ అవుతున్నారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో భారత కెప్టెన్ రోహిత్ వాయిస్ వాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. రోహిత్ వాయిస్ కాకుండా ఇంకేం దొరకలేదా? అని విమర్శిస్తున్నారు. తమ సొంత టోర్నమెంట్ ను ప్రోత్సహించడానికి టీమిండియా కెప్టెన్ మాటాలను ఎందుకు ఉపయోగించాలని ప్రశ్నిస్తున్నారు.

ఆ కెప్టెన్

పాకిస్తాన్ జాతీయ జట్టుకు కూడా నాయకత్వం వహిస్తున్న మహమ్మద్ రిజ్వాన్ ప్రస్తుతం సుల్తాన్స్ కెప్టెన్. అయితే, ఈ నెల ప్రారంభంలో ఐదు టీ20ల సిరీస్ కోసం న్యూజిలాండ్‌కు వెళ్ళిన పాకిస్తాన్ జట్టు కు రిజ్వాన్ ఎంపికవలేదు. సల్మాన్ అఘా పాకిస్తాన్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.

పీఎస్ఎల్ 2025 ఏప్రిల్ 11న ప్రారంభం కానుంది. ఐపీఎల్, పీఎస్ఎల్ ఒకేసారి జరగడం ఇదే మొదటిసారి. నిజానికి పాకిస్థాన్ సూపర్ లీగ్.. ప్రతి ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరుగుతుంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వడంతో పీఎస్ఎల్ ను ఏప్రిల్-మే విండోకు మార్చాల్సి వచ్చింది.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం