Khushdil Shah Attack Fans: వీధి రౌడీల్లా పాక్ క్రికెటర్లు.. ఫ్యాన్స్ పై ఖుష్దీల్ షా దాడి.. లాగి పడేసిన సెక్యూరిటీ-pakistan players behaviour with fans all rounder khushdil shah attack security dragged him out video viral pcb statement ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Khushdil Shah Attack Fans: వీధి రౌడీల్లా పాక్ క్రికెటర్లు.. ఫ్యాన్స్ పై ఖుష్దీల్ షా దాడి.. లాగి పడేసిన సెక్యూరిటీ

Khushdil Shah Attack Fans: వీధి రౌడీల్లా పాక్ క్రికెటర్లు.. ఫ్యాన్స్ పై ఖుష్దీల్ షా దాడి.. లాగి పడేసిన సెక్యూరిటీ

Khushdil Shah Attack Fans: న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవాన్ని తట్టుకోలేకపోయిన పాకిస్థాన్ క్రికెటర్లు వీధి రౌడీల్లా మారారు. ప్రొఫెషనల్ క్రికెటర్స్ అనే సంగతి మర్చిపోయి ఫ్యాన్స్ పై అటాక్ చేశారు. దాడికి దిగిన ఆల్ రౌండర్ ఖుష్దీల్ షాను సెక్యూరిటీ లాగి పడేశారు.

ఖుష్దీల్ షాను లాగేస్తున్న సెక్యూరిటీ (AFP)

గ్రౌండ్ లో పర్ఫార్మెన్స్ చూపలేకపోయిన పాకిస్థాన్ టీమ్.. ఫ్యాన్స్ పై మాత్రం ఆగ్రహం చూపించింది. రన్స్ కొట్టలేకపోయిన ఆ టీమ్.. ఫ్యాన్స్ ను కొట్టడానికి మాత్రం రెడీ అయిపోయింది. శనివారం (ఏప్రిల్ 5) మౌంట్ మౌంగనుయిలోని బే ఓవల్ మైదానంలో పాకిస్థాన్ క్రికెటర్లు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. అభిమానులపై దాడికి ప్రయత్నించారు. సెక్యూరిటీ సిబ్బంది క్రికెటర్లను లాగి పడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆల్ రౌండర్ ఖుష్దీల్ షా ఊగిపోయాడు.

ఏం జరిగిందంటే?

న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్థాన్ టీమ్ దారుణ ప్రదర్శన చేసింది. టీ20 సిరీస్ ను 1-4తో కోల్పోయిన ఆ టీమ్.. వన్డే సిరీస్ లో 0-3తో వైట్ వాష్ కు గురయ్యారు. ఈ సిరీస్ సాంతం పాక్ క్రికెటర్ల పర్ఫార్మెన్స్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆ ఆటగాళ్లను ఫ్యాన్స్ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ టీమ్ ప్రదర్శన కూడా అలాగే ఉంది.

శనివారం న్యూజిలాండ్ తో చివరిదైన మూడో వన్డేలోనూ పాకిస్థాన్ చిత్తయింది. దీంతో ఫ్యాన్స్ మరోసారి పాక్ ఆటగాళ్లపై విమర్శలు చేశారు. దీంతో పాక్ ఆటగాళ్లు తట్టుకోలేకపోయారు. సెన్స్ మరిచిపోయారు. ముఖ్యంగా ఖుష్దీల్ షా ఫ్యాన్స్ మీదకు పరుగెత్తాడు. దాడి చేసేందుకు ప్రయత్నించాడు. కోపంతో ఊగిపోయాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఖుష్దీల్ షాను లాగి పడేశారు. గ్రౌండ్ ఆడమంటేనేమో సైలెంట్ గా ఉండే పాక్ ఆటగాళ్లు.. ఫ్యాన్స్ పై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారనే ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఖుష్దీల్ ఎందుకు ఆగ్రహంగా ప్రవర్తించాడో తెలియదు.

పీసీబీ ఏం చెప్పిందంటే?

ఈ ఘటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ ఆటగాళ్లను వెనకేసుకొచ్చింది. విదేశీ ప్రేక్షకులు ఆటగాళ్లపై అవమానకరమైన మాటలు అన్నారని పేర్కొంది. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు విన్న తర్వాత ఖుష్దీల్ కోపంతో ఊగిపోయాడని తెలిపింది.

"విదేశీ ప్రేక్షకులు జాతీయ ఆటగాళ్లపై అవమానకరమైన భాషను ఉపయోగించడాన్ని పాకిస్తాన్ క్రికెట్ జట్టు యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. నేటి మ్యాచ్‌లో, విదేశీ ప్రేక్షకులు మైదానంలో ఉన్న క్రికెటర్లపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు." అని పీసీబీ తెలిపింది.

"పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు వచ్చినప్పుడు, క్రికెటర్ ఖుష్దీల్ షా జోక్యం చేసుకుని ప్రేక్షకులను ఆపమని కోరాడు. కానీ అఫ్గాన్ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోచారు. పాకిస్తాన్ జట్టు ఫిర్యాదు చేసిన తర్వాత, స్టేడియం అధికారులు జోక్యం చేసుకుని ఇద్దరు అల్లర్ల కల్గించిన ప్రేక్షకులను బయటకు పంపించారు" అని ప్రకటనలో పీసీబీ పేర్కొంది.

పాక్ చిత్తు

చివరి వన్డేలో పాకిస్తాన్ 43 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. మహమ్మద్ రిజ్వాన్ అండ్ కో 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. బాబర్ ఆజం 50, రిజ్వాన్ 37 పరుగులు చేసి జట్టును పోటీలో ఉంచారు. అయితే, ఈ ఇద్దరి వికెట్లు కోల్పోయిన తర్వాత, మరే ఇతర బ్యాట్స్‌మన్ కూడా రాణించలేకపోయాడు. చివరికి కివీస్ 3-0తో సిరీస్‌ను గెలుచుకుంది. ఖుష్దీల్ షా ఈ మూడో వన్డేలో ఆడలేదు.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం