రూ.27 కోట్ల పంత్ ఏం చేస్తాడో? లక్నోకు డూ ఆర్ డై.. సన్ రైజర్స్ తో మ్యాచ్.. ఓడితే ప్లేఆఫ్స్ కు దూరం.. టాస్ గెలిచిన కమిన్స్-must win game for lucknow super giants vs sunrisers hyderabad to stay alive in ipl 2025 play offs all eyes on pant toss ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  రూ.27 కోట్ల పంత్ ఏం చేస్తాడో? లక్నోకు డూ ఆర్ డై.. సన్ రైజర్స్ తో మ్యాచ్.. ఓడితే ప్లేఆఫ్స్ కు దూరం.. టాస్ గెలిచిన కమిన్స్

రూ.27 కోట్ల పంత్ ఏం చేస్తాడో? లక్నోకు డూ ఆర్ డై.. సన్ రైజర్స్ తో మ్యాచ్.. ఓడితే ప్లేఆఫ్స్ కు దూరం.. టాస్ గెలిచిన కమిన్స్

రసవత్తరంగా రీస్టార్ట్ అయి.. జోరుగా సాగుతున్న ఐపీఎల్ 2025లో మరో కీలక మ్యాచ్. డూ ఆర్ డై మ్యాచ్ లో సన్ రైజర్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో ఓడితే లక్నో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్ లో అందరి కళ్లు లక్నో కెప్టెన్ పంత్ పైనే ఉన్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (PTI)

ఐపీఎల్ 2025లో మూడు ప్లేఆఫ్స్ బెర్తులు కన్ఫామ్ అయ్యాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ కు దూసుకెళ్లాయి. ఇక మిగిలింది ఒకటే ప్లేఆఫ్ బెర్త్. దీని కోసం పోటీపడుతున్న మూడు జట్లలో లక్నో సూపర్ జెయింట్స్ ఒకటి. డూ ఆర్ డై మ్యాచ్ లో లక్నోలో సోమవారం (మే 19) సన్ రైజర్స్ హైదరాబాద్ తో లక్నో తలపడుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది.

5 విజయాలు

చావోరేవో తేల్చుకునే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో ఓడితే ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమిస్తుంది. ఈ సీజన్ లో ఆడిన 11 మ్యాచ్ ల్లో లక్నో 5 మాత్రమే గెలిచింది. ఆరు ఓడింది.

ఓడితే ఔట్

లక్నో ఇంకా మూడు మ్యాచ్ లు ఆడబోతోంది. ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్ లు గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై డిపెండ్ కావాల్సిన పరిస్థితి. ఒక్క మ్యాచ్ ఓడినా లీగ్ దశలోనే ఇంటిముఖం పడుతుంది.

ఫెయిల్యూర్ కెప్టెన్

ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలంలో రిషబ్ పంత్ ను లక్నో రూ.27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కానీ పంత్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్ లో దారుణంగా విఫలమయ్యాడు. 11 మ్యాచ్ ల్లో 128 రన్స్ మాత్రమే చేశాడు. సగటు 12.80 కాగా స్ట్రైక్ రేట్ 100 కూడా దాటలేదు.

కీ మ్యాచ్

కెప్టెన్ గానూ పంత్ ఆకట్టుకోలేకపోతున్నాడు. కీలక మ్యాచ్ ల్లో ఒత్తిడికి తలొగ్గి పేలవ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అతని నిర్ణయాలపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో పంత్ ఏం చేస్తాడో చూడాలి.

పరువు కోసం

మరోవైపు ఎంతో హైప్ తో 300 లోడింగ్ అంటూ ఐపీఎల్ 18వ సీజన్ లో అడుగుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ బొక్కబోర్లా పడింది. కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేకపోయింది. 11 మ్యాచ్ ల్లో మూడు మాత్రమే గెలిచింది. ఆరు ఓడింది. ఓ మ్యాచ్ వర్షంతో రద్దయింది.

ఇక మిగిలిన మూడు మ్యాచ్ ల్లో గెలిచి, టేబుల్ లో లాస్ట్ ప్లేస్ దక్కకుండా చూసుకోవడమే సన్ రైజర్స్ కు మిగిలింది. ఆ టీమ్ ఆడాల్సింది పరువు కోసమే. మరి సన్ రైజర్స్ ఎలా ఆడుతుందో? కరోనా పాజిటివ్ గా తేలడంతో ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం