ఐపీఎల్ 2025లో ఆరంభంలో తడబడిన ముంబై ఇండియన్స్ తిరిగి గాడిన పడుతోంది. వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గురువారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి కేవలం 162 పరుగులు మాత్రమే చేసింది. ఈ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ మరో పదకొండు బాల్స్ మిగిలుండగానే 18.1 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు రాయ్ రికిల్టన్, రోహిత్ శర్మ కలిసి ముంబై ఇండియన్స్కు చక్కటి ఆరంభాన్ని అందించారు. రోహిత్ శర్మ పదహారు బాల్స్లో మూడు సిక్సర్లతో ఇరవై ఆరు పరుగులు చేయగా...రికిల్టన్ 31 పరుగులతో రాణించారు.
ఆ తర్వాత విల్ జాక్స్ (26 బాల్స్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 36 రన్స్), సూర్యకుమార్ యాదవ్ కలిసి (15 బాల్స్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లుతో 26 పరుగులు) ముంబైని విజయం దిశగా నడిపించారు. వీరిద్దరితో పాటు హార్దిక్ పాండ్య, నమన్ధీర్లను ఔట్ చేసి ముంబైకి షాకిచ్చారు సన్రైజర్స్ బౌలర్స్. అప్పటికే లక్ష్యానికి ముంబై ఇండియన్స్ చేరువ అయ్యింది. తిలక్ వర్మ ముంబైకి విజయాన్ని అందించాడు. సన్రైజర్స్ బౌలర్లలో కమిన్స్ మూడు, మలింగ రెండు వికెట్లు తీసుకున్నారు.
అంతుకుముందు బ్యాట్స్మెన్స్ తడబాటుతో సన్రైజర్స్ 162 పరుగులు మాత్రమే చేసింది. గత మ్యాచ్లో ధాటిగా ఆడిన సన్రైజర్స్ ప్లేయర్లు ముంబై ఇండియన్స్పై పూర్తిగా తేలిపోయారు. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ (28 రన్స్), నితీష్ కుమార్ రెడ్డి (19 పరుగులు) నెమ్మదిగా ఆడటం సన్రైజర్స్ను దెబ్బతీసింది.
చివరలో క్లాసెన్ 28 బాల్స్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 పరుగులు, అనికేత్ వర్మ 8 బాల్స్లో రెండు సిక్సర్లతో 18 రన్స్ బ్యాట్ ఝులిపించడంతో సన్రైజర్స్ ఈ మాత్రమైనా స్కోరు చేసింది. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ రెండు, బుమ్రా, బౌల్ట్, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీసుకున్నారు.
ఐపీఎల్ 2025లో ఏడు మ్యాచుల్లో ముంబైకి ఇది మూడో విజయం కావడం గమనార్హం. మరోవైపు ఏడు మ్యాచులు ఆడిన సన్రైజర్స్ కేవలం రెండింటిలోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.
సంబంధిత కథనం