Mukesh Kumar, Divya Singh: టీమిండియా పేసర్ ముఖేష్ కుమార్ మంగళవారం తన ప్రియురాలు దివ్య సింగ్ మెడలో మూడుముళ్లు వేశాడు. గోరఖ్పూర్లోని ఓ హోటల్లో ఘనంగా ముఖేష్ కుమార్ పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి ఒక రోజు కూడా కాక ముందే ముఖేష్ కుమార్ తిరిగి టీమ్ ఇండియాలో భాగమయ్యాడు. గురువారం టీమిండియా ప్రాక్టీస్ సేషన్లో ముఖేష్ కుమార్ పాల్గొన్నాడు.
బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టీ20 సిరీస్లో టీమ్ ఇండియా తరఫున ముఖేష్ కుమార్ ఆడుతోన్నాడు. మొదటి టీ20 మ్యాచ్తో పాటు రెండో మ్యాచ్లోనూ ముఖేష్ కుమార్ ఆడాడు. తొలి టీ20లో వికెట్ తీయకున్నా పొదుపుగా బౌలింగ్ చేశాడు. రెండో టీ20లో ఒక వికెట్తో ఆకట్టుకున్నాడు.
పెళ్లి కారణంగా మూడో టీ20 మ్యాచ్కు బీసీసీఐ పర్మిషన్ తీసుకొని దూరమయ్యాడు. మూడో టీ20లో ప్రసిద్ధ్ కృష్ణ దారుణంగా విఫలమైన నేపథ్యంలో నాలుగో మ్యాచ్లో ముఖేష్ కుమార్కు చోటు దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. రాయ్పూర్ వేదికగా డిసెంబర్ 1న (శుక్రవారం) ఐదో టీ20 మ్యాచ్ జరుగనుంది.
ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో టీమ్ ఇండియా బరిలోకి దిగుతోంది. దేశవాళీ క్రికెట్లో బెంగాల్కు ప్రాతినిధ్యం వహిస్తోన్నముఖేష్ కుమార్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతోన్నాడు.