ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకు సింగ్ మధ్య జరిగిన షాకింగ్ ఘటన కలకలం రేపుతోంది. మంగళవారం (ఏప్రిల్ 29) అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ చేతిలో హోం గ్రౌండ్ లో ఢిల్లీ ఓడిపోయింది. ఈ మ్యాచ్ ముగిశాక జరిగిన ఘటనలో రింకు సింగ్ చెంపను కుల్దీప్ రెండు సార్లు చెళ్లుమనిపించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న క్లిప్లో.. కుల్దీప్, రింకు తో పాటు ఇతర ఆటగాళ్లు మ్యాచ్ ముగిశాక నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపించారు. కానీ ఒక్కసారిగా రింకు చెంపపై కుల్దీప్ యాదవ్ బలంగా కొట్టాడు. కుల్దీప్ సరదాగానే కొట్టినా అది రింకు సింగ్ కు నచ్చలేదు. అతను షాక్ కు గురయ్యాడు. వెంటనే కోపం తో చూశాడు. మళ్లీ రింకు చెంపపై కుల్దీప్ కొట్టాడు.
ఈ వీడియో క్లిప్ లో ఆడియో లేదు. దీంతో రింకు సింగ్ చెంపపై కుల్దీప్ ఎందుకు కొట్టాడో కారణం తెలియడం లేదు. మరోవైపు వ్యాఖ్యాతలు కూడా ఈ ఘటనపై మాట్లాడలేదు. అయితే కుల్దీప్ యాదవ్ చేసిన పనిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇది చెత్త ప్రవర్తన అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ నుంచి కుల్దీప్ యాదవ్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2025లో హోం గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన ఆ టీమ్.. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా తొమ్మిది వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది.
ఛేజింగ్లో ఢిల్లీ ఏడు ఓవర్లకు 62/3తో నిలిచింది. అయితే ఫాఫ్ డుప్లెసిస్ (62), అక్షర్ పటేల్ (43) నాల్గవ వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యంతో టీమ్ ను పోటీలో ఉంచారు. సునీల్ నరైన్ (3/29) కీలక సమయంలో మూడు వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బకొట్టాడు. ఆ టీమ్ 20 ఓవర్లలో 190/9కి పరిమితమైంది.
సంబంధిత కథనం