హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ విచిత్రమైన పరిస్థితుల్లో ఔట్ అయ్యాడు. బుధవారం (ఏప్రిల్ 23) ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో ఎలాంటి అప్పీల్ లేకుండా.. అంపైర్ ఔట్ ఇవ్వకుండానే క్రీజు వదిలి ఇషాన్ వెళ్లిపోయాడు. దీంతో ఇషాన్ పై ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఇది ఫిక్సింగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇషాన్ ఇంకా ముంబయి ఇండియన్స్ కే ఆడుతున్నాడంటూ మండిపడుతున్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ లో హెడ్ ఔట్ కాగానే ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చాడు. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ ఫస్ట్ బాల్ లెగ్ సైడ్ వెళ్లింది. ఇషాన్ ఆడాలని చూశాడు కానీ బంతి మిస్ అయ్యి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. ఎవరూ వికెట్ కోసం అప్పీల్ చేయలేదు. అంపైర్ కూడా వైడ్ ఇచ్చేందుకు చేతులు లేపాడు.
కానీ ఇషాన్ కిషన్ బ్యాట్ కు బంతి తగిలిందనుకుని వెళ్లిపోయాడు. అది చూపి అంపైర్ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఔట్ ఇచ్చాడు. అప్పుడు దీపక్ చాహర్ అప్పీల్ చేశాడు. క్రీడా స్ఫూర్తితో వెళ్తున్న ఇషాన్ ను ముంబయి ఆటగాళ్లు అభినందించారు. అప్పుడు ఇషాన్ నవ్వుతూ వెళ్లడం అనుమానాలు రేకెత్తిస్తోంది. రీప్లేలో చూస్తే అసలు బ్యాట్ కు బాల్ తాకలేదని తేలింది. ఇది చూసి డ్రెస్సింగ్ రూమ్ లో ఇషాన్ రియలైజ్ అయ్యాడు.
గత సీజన్ వరకూ ఇషాన్ కిషన్ ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కు ఆడిన సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలంలో అతణ్ని సన్ రైజర్స్ కొనుక్కుంది. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ విచిత్రంగా పెవిలియన్ చేరడంతో అతను ఇంకా ముంబయి ఇండియన్స్ కే ఆడుతున్నాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ముంబయి ఇండియన్స్ ఫిక్సింగ్ కు ఇదే నిదర్శనమని ట్రోల్ చేస్తున్నారు. లీగ్ లో ముంబయి ప్రదర్శన పేలవంగా ఉన్న ప్రతిసారి ఫిక్సింగ్ స్టార్ట్ చేస్తోందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ మరోసారి బ్యాటింగ్ లో ఫెయిలైంది. పవర్ప్లేలో నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 24 పరుగులు మాత్రమే చేసింది. 12 సంవత్సరాలలో మొదటిసారి వారు తమ మొదటి నాలుగు వికెట్లను 20 పరుగుల కంటే తక్కువకు కోల్పోయారు. హెన్రిచ్ క్లాసెన్ 44 బంతుల్లో 71 పరుగులతో పోరాడాడు. అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43 పరుగులు) తో కలిసి అతను 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివరకు ఆ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది.
సంబంధిత కథనం