వరుణుడి ఎఫెక్ట్ - ఆర్‌సీబీ, కేకేఆర్ మ్యాచ్ ఆల‌స్యం - కోహ్లి ఫ్యాన్స్‌కు నిరాశ త‌ప్ప‌దా?-ipl 2025 re start rcb vs kkr match delayed due to rain ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  వరుణుడి ఎఫెక్ట్ - ఆర్‌సీబీ, కేకేఆర్ మ్యాచ్ ఆల‌స్యం - కోహ్లి ఫ్యాన్స్‌కు నిరాశ త‌ప్ప‌దా?

వరుణుడి ఎఫెక్ట్ - ఆర్‌సీబీ, కేకేఆర్ మ్యాచ్ ఆల‌స్యం - కోహ్లి ఫ్యాన్స్‌కు నిరాశ త‌ప్ప‌దా?

Nelki Naresh HT Telugu

ఐపీఎల్ పునఃప్రారంభంపై వ‌రుణుడి దెబ్బ ప‌డింది. శ‌నివారం బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ఆల‌స్యంగా మొద‌లుకాబోతుంది. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో భారీగా వ‌ర్షం కురుస్తోంది.

విరాట్ కోహ్లి

ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా వారం పాటు వాయిదాప‌డిన ఐపీఎల్ శ‌నివారం బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రుగుతోన్న మ్యాచ్ తో తిరిగి మొద‌లుకాబోతుంది. అయితే వ‌ర్షం కార‌ణంగా ఈ మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో భారీగా వ‌ర్షం కురుస్తుండంతో చిన్న‌స్వామి స్టేడియం జ‌ల‌మ‌య‌మైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి.

ఘనంగా వీడ్కోలు…

ఈ మ్యాచ్‌కు కోహ్లి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిల‌వ‌నున్నాడు. ఇటీవ‌లే కోహ్లి టెస్ట్‌ల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. రిటైర్‌మెంట్ త‌ర్వాత అత‌డు ఆడ‌నున్న మొద‌టి మ్యాచ్ ఇది. అత‌డిని ఘ‌నంగా వీడ్కోలు ప‌ల‌కాల‌ని అభిమానులు భారీగానే ప్లాన్స్ చేశారు.

కోహ్లి పేర్ల‌తో ఉన్న వైట్ జ‌ర్సీలు ధ‌రించిన స్టేడియానికి త‌ర‌లివ‌చ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. వ‌ర్షం కార‌ణంగా కోహ్లి ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలేలా క‌నిపిస్తోంది. .

నేరుగా ప్లేఆఫ్స్‌...

ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తాపై విజ‌యం సాధిస్తే బెంగ‌ళూరు నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 11 మ్యాచుల్లో ఎనిమిది విజ‌యాల‌తో ప్ర‌స్తుతం ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ బెంగ‌ళూరు రెండో స్థానంలో కొన‌సాగుతోంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తే ప్లేఅఫ్స్ చేరుకోవ‌డ‌మే కాకుండా ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లోనూ టాప్‌లోకి దూసుకెళుతుంది.

మ‌రోవైపు ప్లేఆఫ్స్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకోవాలంటే కోల్‌క‌తా ఈ మ్యాచ్‌లో త‌ప్ప‌క గెల‌వాల్సిందే. ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచ్‌లు ఆడిన కోల్‌క‌తా కేవ‌లం అయిదింటిలోనే విజ‌యాన్ని సాధించింది.

మ‌ధ్య‌లోనే..

పాకిస్థాన్ దాడులు చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో క్రికెట‌ర్ల భ‌ద్ర‌తా దృష్ట్యా ఐపీఎల్‌ను అర్థాంత‌రంగా వాయిదా వేసింది బీసీసీఐ. ఢీల్లీ, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోండ‌గా మ‌ధ్య‌లోనే నిలిపివేసి అభిమానుల‌ను బ‌య‌ట‌కు పంపించారు. యుద్ధ భ‌యాలు తొల‌గిపోవ‌డంతో శ‌నివారం నుంచి ఐపీఎల్‌ను పునఃప్రారంభం కాబోతుంది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం