్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరదకు బదులు వరుణుడి ప్రతాపం కనిపిస్తోంది. శుక్రవారం (ఏప్రిల్ 18) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ కు వర్షం ఆటంకం కొనసాగుతోంది. సాయంత్రం 7 గంటలకు వేయాల్సిన టాస్ కూడా ఇంకా పడలేదు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వరుణుడి ప్రతాపం ఆగడం లేదు. హౌం గ్రౌండ్ లో ఆర్సీబీ ఈ సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంటే చూడాలని వచ్చిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పడం లేదు. వర్షం ఆగడం లేదు. దీంతో మ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ ను కనీసం 5 ఓవర్లు నిర్వహించాలన్నా వరుణుడు విరామమిచ్చి, గ్రౌండ్ ఆటకు సిద్దం కావాల్సి ఉంది.
ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్ వరుణుడి ఖాతాలో చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. వర్షం కారణంగా ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్ టాస్ కూడా ఇంకా వేయలేదు. వాన ఆగడం లేదు. సాయంత్రం 7 గంటలకు టాస్ వేయాల్సింది. 7.30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కావాలి. కానీ వర్షం కారణంగా ఇంకా ఎలాంటి అప్ డేట్ రావడం లేదు.
మ్యాచ్ కంప్లీట్ చేయాలంటే ఇన్నింగ్స్ కు కనీసం 5 ఓవర్ల ఆట నిర్వహించాలి. అందుకు కటాఫ్ టైమ్ రాత్రి 10.56 గంటలు. ఆ టైమ్ కు మ్యాచ్ స్టార్ట్ కావాలి. అంతకంటే ముందు టాస్ వేయడానికి కటాఫ్ టైమ్ రాత్రి 10.41 గంటలు. ఆ సమయం వరకు టాస్ వేసేందుకు పరిస్థితి అనుకూలంగా ఉంటేనే మ్యాచ్ నిర్వహిస్తారు. లేదంటే మ్యాచ్ ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో, పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ రెండు టీమ్స్ తో పాటు సెకండ్ ప్లేస్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్, అయిదో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఎనిమిది పాయింట్లతో ఉన్నాయి. టాప్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో 10 పాయింట్లున్నాయి. కేకేఆర్, ముంబయి చెరో ఆరు పాయింట్లతో వరుసగా 6, 7 స్థానాల్లో ఉన్నాయి. వరుసగా 8 నుంచి 10 స్థానాల్లో ఉన్న ఆర్ఆర్, సన్ రైజర్స్, సీఎస్కే 4 పాయింట్లతో ఉన్నాయి.
సంబంధిత కథనం