చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ తో వరుణుడు ఆటాడుకుంటున్నాడు. వెళ్తూ, వస్తూ వెయిటింగ్ కొనసాగిస్తున్న వర్షం.. చివరకు ఆగింది. దీంతో ఇన్నింగ్స్ కు 14 ఓవర్ల చొప్పున కుదించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 18) చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో టెన్షన్ నెలకొంది. సాయంత్రం నుంచి వర్షం కురవడంతో టాస్ ఆలస్యమైంది. మొదట వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో మ్యాచ్ రద్దవుతుందేమో అనిపించింది. కానీ వరుణుడు బ్రేక్ ఇవ్వడంతో రాత్రి 9.30 గంటలకు టాస్ వేశారు.
రాత్రి 9.45 గంటలకు మ్యాచ్ స్టార్ట్ చేద్దామనుకున్నారు. కానీ కరెక్ట్ అదే టైమ్ కు మళ్లీ చినుకులు వచ్చాయి. కానీ ఈ సారి ఎక్కువ సేపు ఉండలేదు. దీంతో మ్యాచ్ స్టార్ట్ చేశారు.
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ ఓ మార్పు చేసింది. వరుసగా ఫెయిల్ అవుతున్న మ్యాక్స్ వెల్ స్థానంలో స్టాయినిస్ ను తీసుకుంది.
వర్షం కారణంగా రెండు గంటల టైమ్ తుడిచి పెట్టుకుపోవడంతో మ్యాచ్ ఓవర్లను కుదించారు. ఇన్నింగ్స్ కు 14 ఓవర్లు చొప్పున మ్యాచ్ నిర్వహిస్తున్నారు. పవర్ ప్లే 4 ఓవర్లు. 4 బౌలర్లు 3 ఓవర్ల చొప్పున వేయొచ్చు. ఓ బౌలర్ రెండు ఓవర్లు వేయొచ్చు.
సంబంధిత కథనం