ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఫైనల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడేందుకు బరిలోకి దిగాయి. ఈ క్వాలిఫయర్ 2లో గెలిచిన జట్టు ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర స్టేడియం వేదికగా నేడు (జూన్ 1) ముంబై, పంజాబ్ మధ్య ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 పోరు మొదలైంది. ఈ క్వాలిఫయర్ 2 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి, ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్కు దిగనుంది.
గత మ్యాచ్తో పోలిస్తే ఈ క్వాలిఫయర్-2 కోసం తుది జట్టులో ఓ మార్పు చేసింది ముంబై ఇండియన్స్. పేసర్0 రిచర్డ్ గ్లెసెన్ స్థానంలో రీస్ టాప్లీని తీసుకుంది. ఫిట్నెస్ ఇబ్బందితో గ్లెసెన్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ సమయంలో చెప్పాడు.
కీలకమైన ఈ క్వాలిఫయర్-2 మ్యాచ్కు వర్షం ముప్పు కూడా పొంచి ఉంది. వాన వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్కు రిజర్వే డే లేదు. ఒకవేళ వాన వల్ల రద్దయితే పంజాబ్ ఫైనల్కు వెళుతుంది. మరి వరుణుడు కరుణిస్తాడేమో చూడాలి.
ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఉత్కంఠ పోరులో గెలిచి క్వాలిఫయర్-2లో ముంబై అడుగుపెట్టింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించింది హార్దిక్ పాండ్యా టీమ్. క్వాలిఫయర్-1లో బెంగళూరు చేతిలో ఓడిన పంజాబ్ సత్తాచాటాలని పట్టుదలగా ఉంది. రెండో క్వాలిఫయర్లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కసిగా ఉంది. ఈ నాకౌట్ పోరులో గెలిచిన జట్టు తుదిపోరులో బెంగళూరుతో పోటీ పడుతుంది. ఓడిన జట్టు నిష్క్రమిస్తుంది.
ముంబై ఇండియన్ తుదిజట్టు: రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ధీర్, రాజ్ బావా, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీ
పంజాబ్ కింగ్స్ తుదిజట్టు: జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టొయినిస్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జెమీసన్, విజయ్ కుమార్ వైశాఖ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్
సంబంధిత కథనం