ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరుకున్నాయి. ఆదివారం (మే 18) జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ పై 10 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలిచింది. దీంతో గుజరాత్, పంజాబ్ తో పాటు ఆర్సీబీ కూడా ప్లేఆఫ్స్ చేరిపోయింది.
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించేశాయి. ఇక మిగిలింది ఒకే ప్లేస్. ఈ బెర్తు కోసం ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడుతున్నాయి. ఈ టీమ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
మిగిలిన మ్యాచ్ లు: డీసీ, పీబీకేఎస్
హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబయి ఇండియన్స్ మిగతా ఢిల్లీ, లక్నో కంటే బెటర్ గా ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. వాస్తవానికి సొంతగడ్డపై ఢిల్లీని మరోసారి ఓడించినా ముంబయికి ఛాన్స్ ఉంటుంది.. అప్పుడు లక్నో మూడు మ్యాచ్ ల్లో ఒకటి ఓడిపోవాలి. అయితే ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఓడినా చివరి మ్యాచ్ లో పంజాబ్ పై విజయం సాధించినా ముంబయి ముందంజ వేయలేదు.
మిగిలిన మ్యాచ్ లు: ఎంఐ, పీబీకేఎస్
ఢిల్లీ ఐపీఎల్ 2025 సీజన్ ను గొప్పగా ప్రారంభించింది. మొదటి నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. సీజన్లో ఎక్కువ భాగం టాప్ హాఫ్లోనే కొనసాగింది. అయితే గత ఎనిమిది మ్యాచ్ ల్లో ఐదింటిలో ఓడిపోవడంతో టాప్-4కు దూరమై ఇప్పుడు ఎలిమినేషన్ అంచున నిలిచింది. క్వాలిఫికేషన్ లో ఉన్న ఏకైక లక్ష్యం రెండు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించడం. ఒక్క మ్యాచ్ లో ఓడినా ఆ టీమ్ పనైపోతుంది.
మిగిలిన మ్యాచ్ లు: ఎస్ ఆర్ హెచ్, జీటీ, ఆర్సీబీ
ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో పోలిస్తే లక్నో ఒక మ్యాచ్ ఎక్కువగా ఆడనుంది. అయినా ప్లేఆఫ్స్ దిశగా ఆ టీమ్ ఫేవరెట్ గా లేదు. గత ఐదు మ్యాచ్ లలో నాలుగింటిలో ఓడిపోయింది లక్నో. మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిచినా ఎల్ఎస్జీ 16 పాయింట్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఢిల్లీ, ముంబయి తమ మ్యాచ్ ల్లో ఓడిపోవాలి.
సంబంధిత కథనం