భారత్ వర్సెస్ పాక్ ఉద్రిక్తతలు.. ధర్మశాలలో టెన్షన్.. పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ రద్దు-ipl 2025 pbks vs dc match called off dharamsala due to india vs pakistan tension siruation prabhsimran priyansh arya ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  భారత్ వర్సెస్ పాక్ ఉద్రిక్తతలు.. ధర్మశాలలో టెన్షన్.. పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ రద్దు

భారత్ వర్సెస్ పాక్ ఉద్రిక్తతలు.. ధర్మశాలలో టెన్షన్.. పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ రద్దు

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. గురువారం ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను మధ్యలో ఆపేశారు. స్టేడియాన్ని ఖాళీ చేశారు.

ధర్మశాల స్టేడియం (Surjeet Yadav)

ఐపీఎల్ 2025లో భాగంగా ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దయింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మ్యాచ్ ను మధ్యలోనే ఆపేశారు. ఇరు జట్లను, ఫ్యాన్స్ ను స్టేడియం నుంచి పంపించేశారు. లోకల్ పోలీస్, ఆర్మీ కలిసి దగ్గరుండి భద్రతా ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్టేడియాన్ని ఖాళీ చేశారు.

ఏమైందంటే?

గురువారం (మే 8) ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 10.1 ఓవర్లలో 122/1తో ఉన్న సమయంలో మ్యాచ్ ను ఆపేశారు. ముందు ఫ్లడ్ లైట్ ఫెయిల్యూర్ కారణమని చెప్పారు. ఓ వైపు ఫ్లడ్ లైట్స్ ఆపేశారు. కానీ తర్వాత భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ దాడి చేసే అవకాశం ఉందని మ్యాచ్ ను రద్దు చేశారు.

ఆటగాళ్లను రైళ్లలో

ఒక వైపు మాత్రమే ఫ్లడ్ లైట్లు ఆన్ చేసి ఫ్యాన్స్ ను జాగ్రత్తగా బయటకు పంపించారు. ఎలాంటి ఇన్సిండెెంట్లు జరగకుండా పోలీసులు, ఆర్మీ సైనికులు జాగ్రత్తలు తీసుకున్నారు. బ్లాక్ ఔట్ కారణంగా లైట్స్ ఆపేశారని సమాచారం. మరోవైపు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లను రైళ్లలో తరలించే అవకాశముంది. ఢిల్లీ ఆటగాళ్లను ఢిల్లీకి, పంజాబ్ ప్లేయర్లను అహ్మదాబాద్ కు పంపిస్తారని సమాచారం. ఇప్పటికే ధర్మశాల విమానాశ్రయాన్ని మూసేసిన సంగతి తెలిసిందే.

స్టేడియం ఖాళీ చేయాలని

భద్రత పరమైన కారణాల రీత్యా స్టేడియాన్ని ఖాళీ చేయాలని ఐపీఎల్ అధికారులకు ఆదేశాలు అందాయని క్రిక్ ఇన్ఫో పేర్కొంది. అందుకే మ్యాచ్ ను మధ్యలోనే ఆపేశారు. పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’లో భాగంగా భారత్ దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా సరిహద్దు వెంబడి ప్రాంతాలపై పాక్ తెగించి మరీ కాల్పులు చేస్తోంది. దాడులు చేస్తోంది.

టెక్నికల్ ఫెయిల్యూర్

మరోవైపు అఫీషియల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ మాత్రం టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగా మ్యాచ్ రద్దు అయిందని పేర్కొంది. ధర్మశాల స్టేడియంలోని ఫ్లడ్ లైట్లలో టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగా మ్యాచ్ క్యాన్సిల్ అయిందని పేర్కొంది. మరోవైపు ధర్మశాలలో మే 11న జరగాల్సిన ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ను అహ్మదాబాద్ కు షిఫ్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అంతకుముందు వర్షం కారణంగా మ్యాచ్ గంట ఆలస్యంగా మొదలైంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ టీమ్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (34 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్ సిమ్రన్ సింగ్ (50 నాటౌట్; 28 బంతుల్లో 7 ఫోర్లు) అదరగొట్టారు. ప్రియాన్ష్ ఆర్య వికెట్ పడ్డ తర్వాత మ్యాచ్ ఆగిపోయింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం