ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ధర్మశాలలో జరగాల్సిన ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ వేదిక మారింది. మే 11న జరగాల్సిన ఈ మ్యాచ్ ను ధర్మశాలలో కాకుండా అహ్మదాబాద్ లో నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. మరోవైపు బార్డర్ లోని భారత్ లోని ప్రాంతాలను పాకిస్థాన్ టార్గెట్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పాక్ బార్డర్ కు సమీపంలో ఉన్న ధర్మశాల నుంచి మ్యాచ్ ను తరలించారు.
షెడ్యూల్ ప్రకారం ఆదివారం (మే 11) ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ జరగాల్సింది. కానీ ఆపరేషన్ సింధూర్ కారణంగా ఈ మ్యాచ్ ను ధర్మశాల నుంచి అహ్మదాబాద్కు మార్చారు. ఈ మ్యాచ్ ఇప్పుడు అహ్మదాబాద్లో జరుగుతుంది. ఈ విషయాన్ని గురువారం (మే 8) గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) కార్యదర్శి అనిల్ పటేల్ కూడా హిందుస్తాన్ టైమ్స్కు ధ్రువీకరించారు.
ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. "అవును, పంజాబ్ కింగ్స్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ను అహ్మదాబాద్కు మార్చారు" అని అనిల్ పటేల్ వెల్లడించారు.
టాటా ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ వేదికను మార్చినట్లు ఐపీఎల్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఎక్స్ లో పోస్టు చేసింది. ‘‘టాటా ఐపీఎల్ లోని పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరగాల్సిన 61వ మ్యాచ్ ధర్మశాల నుంచి అహ్మదాబాద్ కు ఫిష్ట్ అయింది’’ అని ఎక్స్ లో ఐపీఎల్ పోస్టు చేసింది.
అయితే ముందుగా ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ను ముంబయిలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం లేదా బ్రాబోర్న్ స్టేడియంకు మార్చవచ్చని వార్తలు వచ్చాయి. అయితే ఇది ముంబయి ఇండియన్స్కు ప్రయోజనం చేకూర్చేది. ఎందుకంటే వాళ్లు అపోనెంట్ గ్రౌండ్ లో పంజాబ్ తో ఆడాలి. కానీ ముంబయిలోనే ఆడితే హోం గ్రౌండ్ అడ్వాంటేజీ ఉంటుంది. అందుకే చివరగా అహ్మదాబాద్ ను ఎంచుకున్నారు. రెండు టీమ్స్ కు ఇది తటస్ఠ వేదిక కానుంది.
నేడు (మే 8) ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మాత్రం యథాతథంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం, జట్లుకు ఇక్కడికి చేరుకోవడంతో స్టేడియం మార్చడం సాధ్యం కాలేదు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. మే 7న బుధవారం భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సింధూర్' ప్రారంభించిన తర్వాత భద్రతా ఆందోళనలు పెరిగాయి.
సంబంధిత కథనం