నీకెందుకు రూ.27 కోట్లు.. 27 రూపాయలు చాలు.. తిరిగి ఇచ్చేయాలంటూ పంత్ పై ట్రోల్స్-ipl 2025 lucknow super giants captain rishabh pant critisicism over poor performanc fans trolls him return rs 27 crore ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  నీకెందుకు రూ.27 కోట్లు.. 27 రూపాయలు చాలు.. తిరిగి ఇచ్చేయాలంటూ పంత్ పై ట్రోల్స్

నీకెందుకు రూ.27 కోట్లు.. 27 రూపాయలు చాలు.. తిరిగి ఇచ్చేయాలంటూ పంత్ పై ట్రోల్స్

ఐపీఎల్ 2025లో వరుసగా ఫెయిల్ అవుతున్న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పై విమర్శలు మరో రేంజ్ కు చేరాయి. రూ.27 కోట్లు తిరిగి ఇచ్చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మోత మోగుతోంది.

రిషబ్ పంత్ (REUTERS)

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పై ట్రోల్స్ మోత మోగుతోంది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రూ.27 కోట్లు వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పంత్ ను టార్గెట్ చేసుకుని విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. ఐపీఎల్ 2025లో పంత్ వరుస ఫెయిల్యూర్స్ అందుకు కారణం.

మళ్లీ డకౌట్

తన మాజీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై రిషబ్ పంత్ మళ్లీ ఫెయిలయ్యాడు. ఈ సీజన్ లో ఆ టీమ్ తో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ డకౌటయ్యాడు. మంగళవారం (ఏప్రిల్ 22) ఢిల్లీతో మ్యాచ్ లో అనూహ్యంగా ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పంత్ లాస్ట్ రెండు బంతులాడి సున్నాకే ఔటయ్యాడు. దీంతో పంత్ పై ట్రోల్స్ దాడి మరింత పెరిగింది.

ఐపీఎల్ సీజన్‌లో తొమ్మిది ఇన్నింగ్స్‌లో కేవలం 106 పరుగులు మాత్రమే చేసిన పంత్.. ఢిల్లీపై 7వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. తొమ్మిది సంవత్సరాల తర్వాత తొలిసారిగా పంత్ టీ20 కెరీర్‌లో 7వ స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. చివరిసారిగా ఐపీఎల్ 2016లో రెండు సార్లు ఇలా చేశాడు.

దాక్కుంటున్నాడు

ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో బ్యాటింగ్ చేయడానికి భయపడి పంత్ దాక్కున్నాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అభిమానులు అతన్ని అన్ క్యాప్డ్ ఆటగాళ్ళైన అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని వెనుక 'దాగి ఉన్నాడని' ఆరోపించారు. అయితే పంత్ కుడిచేతికి గాయమైనట్లు తెలుస్తోంది. అతను చేతికి పట్టీతో కనిపించాడు.

ఆ డబ్బు ఇచ్చెయ్

ఐపీఎల్ మెగా వేలంలో పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27 కోట్లు ఖర్చు పెట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ నిలిచాడు. అతణ్ని భారీ రేటుకు కొన్ని లక్నో.. కెప్టెన్సీ పగ్గాలు కూడా అప్పగించింది. కానీ పంత్ బ్యాటింగ్ లో ఫెయిలవుతున్నాడు. అతని యావరేజ్ 13.25 కాగా.. స్ట్రైక్ రేట్ వంద కూడా లేదు. దీంతో రూ.27 కోట్లు తిరిగి లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకాకు తిరిగి ఇచ్చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. పంత్ కు 27 రూపాయలే ఎక్కువ అని దారుణంగా విమర్శిస్తున్నారు.

ముకేశ్ అదుర్స్

ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేసింది. ముకేశ్ కుమార్ 4 వికెట్లతో లక్నోను చావుదెబ్బ కొట్టాడు. ఫస్ట్ 10 ఓవర్లలో 87 పరుగులు చేసిన లక్నో.. లాస్ట్ 10 ఓవర్లలో 72 పరుగలే చేసింది. ఛేదనలో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో గెలిచింది. అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో ఢిల్లీని గెలిపించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం