ఐపీఎల్ 2025 లో టఫ్ ఫైట్ నడుస్తోంది. అంచనాలకు అందని విధంగా లీగ్ దశలో మ్యాచ్ లు సాగుతున్నాయి. టాప్ టీమ్స్ షాకింగ్ ఓటములు చెందుతుండగా.. చిన్న జట్లు విజయాలతో దూసుకెళ్తున్నాయి. ఈ సీజన్ సగం కంప్లీట్ అయింది. 4 జట్లు 10 పాయింట్లతో ఉన్నాయి.
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ దూసుకెళ్తోంది. ఆ టీమ్ ఇప్పుడు టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. గుజరాత్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా 10 పాయింట్లతో కొనసాగుతున్నాయి. కానీ నెట్ రన్ రేట్ ఆధారంగా ఈ టీమ్స్ టాప్ లో 1 నుంచి 4 స్థానాల్లో ఉన్నాయి.
గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ 7 మ్యాచ్ ల్లో 5 గెలిచాయి. రెండు ఓడాయి. లక్నో ఏమో 8 మ్యాచ్ ల్లో 5 గెలిచి, మూడు ఓడింది. గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, లక్నో నెట్ రన్ రేట్ వరుసగా 0.984, 0.589, 0.308, 0.088గా ఉంది.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో చోటు కోసం ఆర్సీబీ, కేకేఆర్, ముంబయి ఇండియన్స్ పోరాడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 మ్యాచ్ ల్లో4 గెలిచి, 3 ఓడింది. 8 పాయింట్లతో ఆ టీమ్ అయిదో ప్లేస్ లో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ముంబయి ఇండియన్స్ 7 మ్యాచ్ ల్లో 3 విజయాలు సాధించాయి. 4 మ్యాచ్ ల్లో పరాజయం పాలయ్యాయి.
6 పాయింట్లతో ఉన్న కేకేఆర్, ముంబయి నెట్ రన్ రేట్ లో వేరుగా ఉన్నాయి. 0.547 రన్ రేట్ తో కేకేఆర్ ఆరో ప్లేస్ లో, 0.239 రన్ రేట్ తో ముంబయి ఏడో ప్లేస్ లో ఉన్నాయి.
ఐపీఎల్ 2025లో అయిదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా లాస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఆ టీమ్ ఈ సీజన్ లో పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆడిన 7 మ్యాచ్ ల్లో రెండు మాత్రమే గెలిచిన సీఎస్కే 4 పాయింట్లతో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ది కూడా ఇదే పరిస్థితి. కానీ సన్ రైజర్స్ -1.217 నెట్ రన్ రేట్, సీఎస్కే -1.276 రన్ రేట్ తో వరుసగా 9, 10 స్థానాల్లో ఉన్నాయి.
ఇక రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచ్ లు ఆడింది. ఆ టీమ్ 2 మాత్రమే గెలిచింది. 6 మ్యాచ్ ల్లో పరాజయం పాలైంది. 4 పాయింట్లో ఉన్న రాజస్థాన్.. -0.633 నెట్ రన్ రేట్ తో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
సంబంధిత కథనం