ఐపీఎల్ లో రూ.23.75 కోట్ల మోసం.. ఆ ఆటగాడికి భారీ రేట్ ఎందుకు పెట్టారు?.. డబ్బులు వేస్ట్.. ఇవీ ఇప్పుడు కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ పెడుతున్న పోస్టులు. వేలంలో భారీ ధర దక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్ మ్యాచ్ ల్లో మాత్రం రేటుకు న్యాయం చేయకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ టో టెస్టు బ్యాటింగ్ చేశాడు వెంకటేశ్.
వెంకటేశ్ అయ్యర్ మరోసారి తన భారీ ధరకు తగ్గట్టుగా ఆడలేకపోయాడు. గుజరాత్ టైటాన్స్తో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో బ్యాట్తో ఫెయిలయ్యాడు. వేలంలో కేకేఆర్ అతణ్ని రూ.23.75 కోట్ల కు కొనుగోలు చేసింది. కానీ రేటు ఎక్కువ ఆట తక్కువ ఆటగాళ్లలో ఒకడిగా వెంకటేశ్ మారాడు.
సోమవారం (ఏప్రిల్ 21) గుజరాత్ తో మ్యాచ్ లో 199 పరుగుల ఛేజ్లో వెంకటేశ్ 19 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్ రేటు 73.68. ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. పైగా అతను కేకేఆర్ ఇన్నింగ్స్ ను స్లో చేయడంతో టీమ్ కు భారీ నష్టమే జరిగింది.
ఐపీఎల్ 2025లో వెంకటేశ్ ప్రసాద్ వరుస ఫెయిల్యూర్స్ కొనసాగుతున్నాయి. ఈ ప్లేయర్ డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ కు భారంగా మారుతున్నాడు. ఈ సీజన్ లో వెంకటేశ్ 8 మ్యాచ్లలో 129 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 25.80 మాత్రమే. భారీ రేట్ అతని ప్రదర్శనపై ఎఫెక్ట్ చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇంత ధర పెట్టి కొన్నా అతను టీమ్ కు ఏ రకంగానూ ఉపయోగపడటం లేదు.
ముఖ్యంగా గుజరాత్ పై టెస్టు ఇన్నింగ్స్ తో వెంకటేశ్ పై ట్రోల్స్ మరింత పెరిగాయి. వెంకటేశ్ క్రీజులోకి వచ్చే సమయానికి కేకేఆర్ బాగానే ఆడుతోంది.. కానీ అతను ఇన్నింగ్స్ ను స్లో చేశాడు. ఈ ఒత్తిడి రహానె మీద పడటంతో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అతను ఔటయ్యాడు. ఆ తర్వాత టీమ్ ఓటమి ఖాయమైంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్.. ఓపెనింగ్ జంట శుభ్మన్ గిల్ (90), సాయి సుదర్శన్ (52)ల అద్భుతమైన ఇన్నింగ్స్ల సహాయంతో 198/3 పరుగులు చేసింది. గిల్ ఈ సీజన్లో తన తొలి శతకం సాధించే అవకాశం కోల్పోయాడు. 55 బంతుల్లో 90 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 3 సిక్స్లు ఉన్నాయి. గిల్, సుదర్శన్ 114 పరుగుల భాగస్వామ్యం ఏర్పరచారు. జోస్ బట్లర్ 23 బంతుల్లో 41 పరుగులు చేశాడు.
సంబంధిత కథనం