ఐపీఎల్ లో అయిదు టైటిళ్లతో టాప్ టీమ్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కు గడ్డు పరిస్థితి. ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో నేడు (ఏప్రిల్ 30) పంజాబ్ కింగ్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2025లో సీఎస్కేకు డూ ఆర్ డై మ్యాచ్. బుధవారం హోం గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో ఓడితే ప్లేఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే నిష్క్రమిస్తుంది. ఈ సీజన్ లో 9 మ్యాచ్ లాడిన ధోని టీమ్ రెండు మాత్రమే గెలిచింది. 7 మ్యాచ్ లు ఓడింది. పంజాబ్ తో మ్యాచ్ లోనే పరాజయం పాలైతే ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరవుతాయి.
ఈ ఐపీఎల్ సీజన్ లో సీఎస్కే కంప్లీట్ టీమ్ గా ఫెయిల్ అవుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించలేకపోతోంది. టీమ్ కెప్టెన్ గా ఎంఎస్ ధోని తిరిగొచ్చినా ఆ జట్టు రాత మారలేదు. ప్లేయర్స్ ను మార్చినా ఆ టీమ్ ఆటతీరులో ఎలాంటి బెటర్ మెంట్ లేదు. మరి హోం గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి, ఆ టీమ్ ప్లేఆఫ్స్ రేసులో ఉంటుందా? లేదా ఓటమితో దెబ్బతింటుందా? చూడాలి.
మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా మళ్లీ గెలుపు బాట పట్టాలని చూస్తోంది. 9 మ్యాచ్ ల్లో ఆ టీమ్ 5 గెలిచి, 3 ఓడింది. కేకేఆర్ తో గత మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో పంజాబ్ ఖాతాలో 11 పాయింట్లున్నాయి. సీఎస్కేపై గెలిస్తే ప్లేఆఫ్స్ టఫ్ ఫైట్ రేసులో పంజాబ్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.
ఆ టీమ్ బ్యాటింగ్ లో యంగ్ ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య అదరగొడుతున్నారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా రాణిస్తున్నాడు. మరోవైపు బౌలింగ్ లో అర్ష్ దీప్, స్పిన్నర్ చాహల్ ఆ టీమ్ కు కీలకంగా మారారు. స్పిన్ కు అనుకూలించే చెపాక్ పిచ్ పై సీనియర్ స్పిన్నర్ చాహల్ కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది. మ్యాక్స్ వెల్ వేలి గాయంతో ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు.
సంబంధిత కథనం