సచిన్ టెండుల్కర్, యువరాజ్ సింగ్ ఎప్పుడో ఆటకు రిటైర్ పలికారు. కానీ గ్రౌండ్ లో మాత్రం అదే క్లాస్ గేమ్ తో అదరగొడుతున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో ఈ లెజెండరీ ప్లేయర్స్ బ్యాటింగ్ తో సత్తాచాటుతున్నారు. క్లాసికల్ బ్యాటింగ్ తో ఫ్యాన్స్ కు కిక్కు ఇస్తున్నారు. మెరుపు షాట్లతో మెరుస్తున్నారు.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ క్లాస్ చూస్తే వావ్ అనాల్సిందే. ఈ టీ20 లీగ్ లో ధనాధన్ బ్యాటింగ్ తో మెరుపు షాట్లు ఆడుతున్నారు. సెమీస్ లో ఆస్ట్రేలియా మాస్టర్స్ టీమ్ పై సచిన్ చెలరేగాడు. 30 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి. తన స్టైల్లో కవర్ డ్రైవ్, స్ట్రెయిట్ డ్రైవ్ తో కళాత్మక బ్యాటింగ్ తో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు.
సెమీస్ లో ఆస్ట్రేలియా మాస్టర్స్ తో మ్యాచ్ లో ఇండియా మాస్టర్స్ తరపున యువరాజ్ సింగ్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. ఏడు సిక్సర్లతో రెచ్చిపోయాడు. వింటేజీ బ్యాటింగ్ తో మెస్మరైజ్ చేశాడు. లాఫ్టెడ్ షాట్లతో అలరించాడు. క్రీజులో కదులుతూ బంతిని స్టాండ్స్ లో పడేశాడు.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ సీజన్ లో ఇండియా మాస్టర్స్ అదరగొడుతోంది. ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్ లో ఆస్ట్రేలియా మాస్టర్స్ పై 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఫస్ట్ ఇండియా మాస్టర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువరాజ్ సింగ్, సచిన్ చెలరేగారు. స్టువర్ట్ బిన్నీ (36), యూసుఫ్ పఠాన్ (23) కూడా అదరగొట్టారు.
ఛేజింగ్ లో ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. షాబాజ్ నదీం 4 వికెట్లతో మెరిశాడు. వినయ్ కుమార్, ఇర్ఫాన్ పఠాన్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫైనల్ ఆదివారం (మార్చి 16) జరుగుతుంది. మరో సెమీస్ లో నేడు (మార్చి 14) శ్రీలంక మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ మధ్య జరుగుతుంది.
సంబంధిత కథనం