Ind W vs WI W 3rd ODI: దీప్తి శర్మ ఆల్‌రౌండ్ షో.. మూడో వన్డేలోనూ విండీస్ చిత్తు.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఇండియా-india women beat west indies women by 5 wickets in 3rd odi to clean sweep the series ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind W Vs Wi W 3rd Odi: దీప్తి శర్మ ఆల్‌రౌండ్ షో.. మూడో వన్డేలోనూ విండీస్ చిత్తు.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఇండియా

Ind W vs WI W 3rd ODI: దీప్తి శర్మ ఆల్‌రౌండ్ షో.. మూడో వన్డేలోనూ విండీస్ చిత్తు.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఇండియా

Hari Prasad S HT Telugu

Ind W vs WI W 3rd ODI: దీప్తి శర్మ ఆల్ రౌండ్ షోతో వెస్టిండీస్ వుమెన్ టీమ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను ఇండియా టీమ్ క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం (డిసెంబర్ 27) జరిగిన మూడో వన్డేలోనూ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

దీప్తి శర్మ ఆల్‌రౌండ్ షో.. మూడో వన్డేలోనూ విండీస్ చిత్తు.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఇండియా

Ind W vs WI W 3rd ODI: దీప్తి శర్మ ఆల్ రౌండ్ షోతో మూడో వన్డేలోనూ వెస్టిండీస్ వుమెన్ టీమ్ ను చిత్తుగా ఓడించింది ఇండియా వుమెన్ టీమ్. మొదట బంతితో ఆరు వికెట్లు తీయడంతోపాటు తర్వాత బ్యాటింగ్ లోనూ 39 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. దీంతో 163 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇండియన్ టీమ్ 28.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసినట్లయింది.

టీమిండియా క్లీన్‌స్వీప్

ఓవైపు ఆస్ట్రేలియాలో ఇండియా మెన్స్ టీమ్ నాలుగో టెస్టులోనూ ఫాలో ఆన్ తప్పించుకోవడానికి కిందామీదా పడుతుంటే.. ఇటు వుమెన్స్ టీమ్ మాత్రం వెస్టిండీస్ పై మూడు వన్డేల సిరీస్ క్వీన్ స్వీప్ చేసింది. తొలి వన్డే నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఇండియన్ టీమ్.. వెస్టిండీస్ కు అసలు ఛాన్స్ ఇవ్వలేదు. వడోదరాలో జరిగిన మూడో వన్డేలోనూ మొదట విండీస్ ను కేవలం 162 పరుగులకే కట్టడి చేసింది.

దీప్తి శర్మ 6, రేణుకా సింగ్ 4 వికెట్లు తీసుకున్నారు. వెస్టిండీస్ 38.5 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. చినెలీ హెన్రీ 61 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. షెమైన్ క్యాంప్‌బెల్ 46 రన్స్ చేసింది. మిగతా బ్యాటర్లందరూ విఫలమవడంతో విండీస్ భారీ స్కోరు చేయలేకపోయింది. దీప్తి శర్మ దెబ్బకు విండీస్ బ్యాటర్లు విలవిల్లాడారు.

దీప్తి బ్యాట్‌తోనూ..

తర్వాత చేజింగ్ లోనూ దీప్తి శర్మ బ్యాట్ తో చెలరేగింది. తక్కువ లక్ష్యమే అయినా 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు స్మృతి మంధానా (4), ప్రతీకా రావల్ (18)తోపాటు రెండో వన్డేలో సెంచరీ చేసిన హర్లీన్ (1) కూడా విఫలమయ్యారు. అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 22 బంతుల్లోనే 32 రన్స్ చేసి ఎదురుదాడికి దిగింది. జెమీమా రోడ్రిగ్స్ (29) కూడా రాణించింది. ఆ తర్వాత దీప్తి శర్మ బౌలింగ్ లో 6 వికెట్లు తీసుకున్న కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగి చివరి వరకూ క్రీజులో నిలిచింది.

39 పరుగులతో అజేయంగా నిలిచి టీమ్ లో టాప్ స్కోరర్ గా నిలిచింది. రిచా ఘోష్ చివర్లో మెరుపులు మెరిపించి జట్టును గెలిచింది. ఆమె కేవలం 11 బంతుల్లో 23 రన్స్ చేసింది. చివర్లో వరుసగా రెండు సిక్స్ లతో మ్యాచ్ ను తనదైన స్టైల్లో ముగించింది. ఆల్ రౌండ్ షోతో దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుంది. తొలి రెండు వన్డేల్లోనూ గెలిచిన ఇండియన్ టీమ్.. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.