ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్టు.. మరికొన్ని గంటల్లోనే స్టార్ట్.. ఎక్కడ చూడొచ్చంటే? స్ట్రీమింగ్ వివరాలివే-india vs england first test streaming details where and when headingley leads shubman gill stokes ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్టు.. మరికొన్ని గంటల్లోనే స్టార్ట్.. ఎక్కడ చూడొచ్చంటే? స్ట్రీమింగ్ వివరాలివే

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్టు.. మరికొన్ని గంటల్లోనే స్టార్ట్.. ఎక్కడ చూడొచ్చంటే? స్ట్రీమింగ్ వివరాలివే

ఐపీఎల్ 2025 కిక్ తర్వాత టెస్టు ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు టీమిండియా సిద్ధమైంది. చాలా కాలం తర్వాత రోహిత్, కోహ్లి లేకుండా భారత జట్టు టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఫస్ట్ టెస్టు నేడే స్టార్ట్ కానుంది. మరి కొన్ని గంటల్లోనే షూరూ కానుంది. ఈ మ్యాచ్ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడున్నాయి.

టీమిండియా పంత్, కుల్ దీప్, జడేజా (PTI)

భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం ప్రారంభమవుతోంది. దశాబ్దానికి పైగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీమిండియా టెస్టు టీమ్ కు ప్రధాన స్తంభాల్లాగా ఉన్నారు. కానీ వీళ్లు ఇద్దరు లేకుండా టీమిండియా చాలా కాలం తర్వాత టెస్టు ఆడబోతుంది. నేడే (జూన్ 20) ఇంగ్లాండ్ తో ఫస్ట్ టెస్టు. కెప్టెన్ గా శుభ్‌మ‌న్ గిల్‌ ఎరా ప్రారంభమవుతుంది. అలాగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్ లో ఇదే ఫస్ట్ సిరీస్. దీంతో ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్ స్పెషల్ గా మారింది.

యంగ్ కెప్టెన్

లీడ్స్ లోని హెడింగ్లీలో జరిగే తొలి టెస్టుతో టీమిండియా ఐదు టెస్టుల ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభం కానుంది. భారత క్రికెట్లో కొత్త శకానికి ఇది నాంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత తొలిసారి టెస్టు జట్టుకు సారథ్యం వహిస్తున్న శుభ్‌మ‌న్ గిల్‌ పై అందరి ఫోకస్ ఉంది. కేవలం 25 సంవత్సరాల వయస్సులో గిల్ టెస్టు పగ్గాలు చేపడుతున్నాడు. అయితే బ్యాటింగ్ పరంగా గిల్ టెస్టు రికార్డు గొప్పగా ఏం లేదు. కేవలం 32 టెస్టులు మాత్రమే ఆడిన గిల్ సగటు 35కు పైగా ఉండడంతో విమర్శలు వస్తున్నాయి.

ఈ ప్లేయర్లు

రిషబ్ పంత్ టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ లో కీలకం కానున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, అర్ష్ దీప్ సింగ్ తో కూడిన పేస్-హెవీ అటాక్ పై భారత్ ఆధారపడే అవకాశం ఉంది. మరోవైపు బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జో రూట్, హ్యారీ బ్రూక్, కాన్వే, డకెట్ లాంటి ప్లేయర్లతో బలంగా ఉంది.

భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

భారత్- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు ఎక్కడ జరుగుతోంది? లీడ్స్ లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.

భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు ఎప్పుడు ప్రారంభం?

జూన్ 20 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు స్టార్టింగ్ టైమ్ ఎప్పుడు?

భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.

భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు భారత్ లో ఎక్కడ ప్రసారం కానుంది?

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు భారత్ లో టీవీలో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రసారం కానుంది.

భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టును భారత్ లో డిజిటల్ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ?

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు జియో హాట్ స్టార్ ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం