Pant: ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డ్ క్రియేట్ చేశాడు. డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్ను 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్గా పంత్ రికార్డ్ క్రియేట్ చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్, కోహ్లి వంటి సీనియర్ క్రికెటర్లు విఫలం కాగా...పంత్ మాత్రం బ్యాట్తో రాణించాడు.
కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పంత్ బెంచ్కే పరిమితమయ్యాడు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ మ్యాచ్లలో వికెట్ కీపర్గా రాహుల్ కనిపించాడు. బంగ్లాదేశ్పై రాహుల్ 41 పరుగులు చేశాడు. పాకిస్థాన్ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు.
న్యూజిలాండ్తో మార్చి 2న జరిగే మ్యాచ్లో రిషబ్ పంత్ బరిలో దిగే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటంతో అతడి స్థానంలో రిషబ్ పంత్ను ఆడించే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. అయితే అందులో నిజం లేదని, తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా న్యూజిలాండ్ మ్యాచ్లో భారత్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ మ్యాచ్లోనూ రిషబ్ పంత్ బెంచ్కు పరిమితం కానున్నట్లు సమాచారం.
జట్టు కూర్పు బాగా సెట్టయిందని, ఈ ఫ్లోను దెబ్బతీయకూడదనే ఆలోచనలో కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నట్లు తెలిసింది.కేఎల్ రాహుల్ వైపే గంభీర్ మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. మరోవైపు మాజీ క్రికెటర్లు గవాస్కర్తో పాటు సంజయ్ మంజ్రేకర్ కూడా తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదని, పంత్, విన్నింగ్ కాంబినేషన్ను ఛేంజ్ చేయడం వల్ల జట్టుకు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని గవాస్కర్ అన్నాడు.
పంత్ అరుదైన ఆటగాడు. అలాంటి టాలెంటెడ్ క్రికెటర్ బెంచ్కు పరిమితం కావడం ఇబ్బందే. కానీ రాహుల్ను తప్పించి మరో కీపర్ను ఛాన్స్ ఇచ్చే అవకాశాలైతే కనిపించడం లేదని అన్నాడు.
మాజీ క్రికెటర్ల మాటలను బట్టి చూస్తే ఛాంపియన్స్ ట్రోఫీ తదుపరి మ్యాచ్లలో పంత్కు ఛాన్స్ దక్కే అవకాశాలు కనపించడం లేదు. ఈ ట్రోర్నీ మొత్తం బెంచ్కు పరిమితం కావడం ఖాయమని తెలుస్తోంది.
పంత్తో పాటు ఆర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్లకకు కూడా ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాల్సిందే.
సంబంధిత కథనం