ముంబయి జోరుకు గుజరాత్ బ్రేక్.. విల్ జాక్స్ పోరాటం.. మోస్తరు స్కోరు చేసిన ఎంఐ.. టైటాన్స్ టార్గెట్ ఎంతంటే?-gujarat titans put a break to mumbai indians will jacks fighting fifty sai kishore spin magic ipl 2025 mi vs gt corbin ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ముంబయి జోరుకు గుజరాత్ బ్రేక్.. విల్ జాక్స్ పోరాటం.. మోస్తరు స్కోరు చేసిన ఎంఐ.. టైటాన్స్ టార్గెట్ ఎంతంటే?

ముంబయి జోరుకు గుజరాత్ బ్రేక్.. విల్ జాక్స్ పోరాటం.. మోస్తరు స్కోరు చేసిన ఎంఐ.. టైటాన్స్ టార్గెట్ ఎంతంటే?

హౌం గ్రౌండ్ లో ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ లో బోల్తా కొట్టింది. స్టార్ బ్యాటర్లున్న ఆ టీమ్ ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో తడబడింది. బ్యాటింగ్ లో ఓ మోస్తరు స్కోరుతోనే సరిపెట్టుకుంది.

హాఫ్ సెంచరీతో పోరాడిన విల్ జాక్స్ (Surjeet Yadav)

ఐపీఎల్ 2025లో వరుసగా ఆరు విజయాలతో దూసుకెళ్తున్న ముంబయి ఇండియన్స్ జోరుకు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ వేసింది. మంగళవారం (మే 6) హోం గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో ముంబయి మోస్తరు స్కోరే చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది.

విల్ జాక్స్ (35 బంతుల్లో 53; 5 ఫోర్లు 3 సిక్సర్లు) ఫైటింగ్ ఫిప్టీతో ముంబయిని ఆదుకున్నాడు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ రెండు వికెట్లతో మాయ చేశాడు. విల్ జాక్స్ ను ఔట్ చేసిన రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 21 రన్స్ మాత్రమే ఇచ్చాడు.

సిరాజ్ ఫస్ట్ ఓవర్లోనే

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ తుస్సుమంది. గుజరాత్ టైటాన్స్ బౌలర్ల ధాటికి ముంబయి చిత్తయింది. సిరాజ్ ఫస్ట్ ఓవర్లోనే సెకండ్ బాల్ కు రికిల్టన్ (2)ను ఔట్ చేశాడు. స్టార్ బ్యాటర్ రోహిత్ (7)ను అర్షద్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. 26 పరుగులకే ముంబయి ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.

జాక్స్, సూర్య పోరాటం

ఓపెనర్ల వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబయి ఇండియన్స్ ను సూర్యకుమార్ (24 బంతుల్లో 35; 5 ఫోర్లు)తో కలిసి విల్ జాక్స్ ఆదుకున్నాడు. గుజరాత్ బౌలర్ల సవాలును ఈ జోడీ బెటర్ గానే ఎదుర్కొంది. ముఖ్యంగా విల్ జాక్స్ మంచి షాట్లు కొట్టాడు. ముంబయి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. 10.3 ఓవర్లకు 97/2తో నిలిచిన ముంబయి భారీ స్కోరు చేసేలా కనిపించింది.

కిశోర్ మాయ

200 స్కోరుకు చేరువగా వెళ్లేలా కనిపించిన ముంబయి ఇండియన్స్ కు గుజరాత్ గొప్పగా బ్రేక్ వేసింది. సూర్యకుమార్ వికెట్ తో భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసిన స్పిన్నర్ సాయి కిశోర్.. తన తర్వాతి ఓవర్లో హార్దిక్ పాండ్య (1)ను బుట్టలో వేసుకున్నాడు. మధ్యలో విల్ జాక్స్ ఇన్నింగ్స్ కు రషీద్ ఖాన్ ఎండ్ కార్డు వేశాడు.

26 రన్స్ 5 వికెట్లు

97/2తో పటిష్ఠంగా కనిపించిన ముంబయి.. గుజరాత్ బౌలర్ల దెబ్బకు 123/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుసగా అయిదు ఓవర్లలో వికెట్లు కోల్పోయింది ఆ టీమ్. 26 రన్స్ తేడాతో అయిదుగురు బ్యాటర్లు పెవిలియన్ చేరిపోయారు. కానీ చివర్లో కార్బిన్ బాష్ (27) భారీ షాట్లతో ముంబయి స్కోర 150 దాటడంలో కీ రోల్ ప్లే చేశాడు. ప్రసిద్ధ్ వేసిన లాస్ట్ ఓవర్ తొలి రెండు బంతులను సిక్సర్లుగా బాదాడు కార్బిన్.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం