వీరులు ఇలా చేయరు.. ప్లీజ్ విరాట్ ఇప్పుడే రిటైరవకు.. ఆందోళనతో ఫ్యాన్స్ రిక్వెస్ట్-fans in tension urges virat kohli to not retire from test cricket now please continue to england tour ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  వీరులు ఇలా చేయరు.. ప్లీజ్ విరాట్ ఇప్పుడే రిటైరవకు.. ఆందోళనతో ఫ్యాన్స్ రిక్వెస్ట్

వీరులు ఇలా చేయరు.. ప్లీజ్ విరాట్ ఇప్పుడే రిటైరవకు.. ఆందోళనతో ఫ్యాన్స్ రిక్వెస్ట్

విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీసీసీఐకి చెప్పేశాడని తెలిసింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. విరాట్ ఇలా చేయొద్దంటూ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు.

విరాట్ కోహ్లి (AFP)

రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి హఠాత్తుగా నిష్క్రమించిన కొన్ని రోజులకే విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వాలనే ఉద్దేశాన్ని బీసీసీఐకి తెలియజేసినట్లు వచ్చిన వార్త భారత క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఒకప్పుడు భారత రెడ్ బాల్ పునరుజ్జీవనానికి చిహ్నంగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా ఈ ఫార్మాట్ కోసం నిలబడిన ఆటగాడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సోషల్ మీడియాలో తీవ్ర భావోద్వేగాలను రేకెత్తించింది.

ఫ్యాన్స్ షాక్

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, కోహ్లి తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం. కానీ ఇంగ్లాండ్ టూర్ ఉన్న నేపథ్యంలో నిర్ణయాన్ని మార్చుకోవాలని, జట్టులో కొనసాగాలని విరాట్ ను బీసీసీఐ కోరింది. దీనిపై కోహ్లి ఇంకా రియాక్ట్ కాలేదు. దీంతో ఫ్యాన్స్ షాక్ కు గురి అవుతున్నారు. ఎమోషనల్ గా రియాక్టవుతున్నారు. ప్లీజ్ కోహ్లి ఇప్పుడే రిటైరవకు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇప్పుడే వద్దు

ఇప్పుడే టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించొద్దని కోహ్లీని ఫ్యాన్స్ కోరుతున్నారు. ‘ఇది విరాట్ కోహ్లి కానే కాదు. ప్లీజ్ ఇలా చేయొద్దు’, ‘పరిస్థితులను చూసి పారిపోవడం వీరుల లక్షణం కాదు. నెవర్ గివప్ ఆటిట్యూడ్ ఏమైంది. ఇంగ్లాండ్ టూర్ లో సత్తాచాటు ప్లీజ్’ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రోహిత్ తో పాటు కోహ్లి కూడా వెళ్లిపోతే భారత టెస్టు క్రికెట్ కు తీరని నష్టం కలుగుతుందని అభిమానులు వాపోతున్నారు.

ఇంగ్లాండ్ టూర్

ప్రతిష్ఠాత్మక ఇంగ్లాండ్ పర్యటన కోసం బీసీసీఐ సమావేశానికి ముందు ఈ పరిణామం జరగడంతో అందరి దృష్టి దీనిపై పడింది. కోహ్లి, రోహిత్ ఇద్దరూ గతంలో బార్బడోస్‌లో జరిగిన ప్రపంచ కప్ గెలుపు తర్వాత టీ20లకు వీడ్కోలు పలికారు. ఇప్పుడు రోహిత్ టెస్టు లకు గుడ్ బై చెప్పాడు. కోహ్లి కూడా అదే ఆలోచనతో ఉన్నాడు. ఇంగ్లాండ్ టూర్ జూన్ 20న స్టార్ట్ అవుతుంది.

యంగ్ కోర్

రోహిత్ తో పాటు కోహ్లి కూడా గుడ్ బై చెప్తే భారత టెస్టు జట్టులో యంగ్ కోర్ మాత్రమే ఉంటుంది. కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ లోకి అడుగుపడుతున్న టీమిండియాకు ఇది ఇబ్బందే. బ్యాటింగ్ యూనిట్‌కు శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ లాంటి వాళ్లే కీలకంగా మారే అవకాశముంది.

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్ సిరీస్‌లో కూడా భారత్ కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఇందులో జట్టు 1-3 తేడాతో ఓడిపోయింది. సవాలుతో కూడిన ఇంగ్లీష్ పర్యటన సమీపిస్తున్న తరుణంలో, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడం జట్టు యాజమాన్యానికి అనుకూలమైన పరిస్థితి కాదు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం