రాజస్థాన్ కు డూ ఆర్ డై.. ఓడితే అంతే.. గుజరాత్ పై టాస్ గెలిచిన పరాగ్.. టీమ్ లో మార్పులు-do or die match for rajasthan royals vs gujarat titans play offs exit ipl 2025 toss update ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  రాజస్థాన్ కు డూ ఆర్ డై.. ఓడితే అంతే.. గుజరాత్ పై టాస్ గెలిచిన పరాగ్.. టీమ్ లో మార్పులు

రాజస్థాన్ కు డూ ఆర్ డై.. ఓడితే అంతే.. గుజరాత్ పై టాస్ గెలిచిన పరాగ్.. టీమ్ లో మార్పులు

ఐపీఎల్ 2025లో చావోరేవో తేల్చుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో ఆ టీమ్ తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.

రాజస్థాన్ రాయల్స్ కు చావోరేవో (REUTERS)

ఐపీఎల్ 2025లో కీలక పోరు. ఆడిన 9 మ్యాచ్ ల్లో కేవలం రెండు మాత్రమే గెలిచిన రాజస్థాన్ రాయల్స్ డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతోంది. సోమవారం (ఏప్రిల్ 28) హోం గ్రౌండ్ లో ఆ టీమ్ గుజరాత్ టైటాన్స్ ను ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.

ఓడితే అంతే

ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఏ టీమ్ అయినా కనీసం 14 పాయింట్లు సాధించాలి. ఇప్పుడు 9 మ్యాచ్ ల్లో రెండు విజయాలు, 4 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ 9వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో ఓడితే రాజస్థాన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఆ టీమ్ కు ఇది కాకుండా ఇంకా 4 మ్యాచ్ లే ఉంటాయి.

గుజరాత్ తో ఓడి, ఆ నాలుగు మ్యాచ్ ల్లో గెలిచినా ఆ టీమ్ పాయింట్స్ 12 మాత్రమే అవుతాయి. అందుకే ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలవాలనే టార్గెట్ తో హోం గ్రౌండ్ లో రాజస్థాన్ అడుగుపెట్టింది. రెగ్యులర్ కెప్టెన్ శాంసన్ గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. రియాన్ పరాగ్ తాత్కాలిక సారథి. ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. తీక్షణ, యుధ్ వీర్ ను ఆడిస్తోంది.

జోరు మీద జీటీ

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ జోరుమీదుంది. ఆ టీమ్ 8 మ్యాచ్ ల్లో 6 గెలిచింది. కానీ రెండు మాత్రమే ఓడింది. 12 పాయింట్లతో టేబుల్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న ఆ టీమ్.. రాజస్థాన్ పై గెలిస్తే ప్లేఆఫ్స్ కు మరింత చేరువవుతుంది. అందుకే రాజస్థాన్ ను చిత్తుచేసి ఆధిపత్యం కొనసాగించాలని ఆ టీమ్ చూస్తోంది.

గుజరాత్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్, బట్లర్ నిలకడగా రాణిస్తున్నారు. బౌలింగ్ లో పేసర్ ప్రసిద్ధ్, స్పిన్నర్ సాయి కిశోర్ అదరగొడుతున్నారు. ఈ మ్యాచ్ తో అఫ్గాన్ ప్లేయర్ కరీమ్ జనత్ ఐపీఎల్ డెబ్యూ చేస్తున్నాడు.

తుది జట్లు:

గుజరాత్ టైటాన్స్: శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్, వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, కరీమ్ జనత్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, సిరాజ్, ప్రసిద్ధ్

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్ మయర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, యుధ్ వీర్ సింగ్

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం