వచ్చే ఐపీఎల్ లోనూ ఆడనున్న ధోని.. హింట్ ఇచ్చేశాడా? అతని కామెంట్లు వైరల్!-dhonis viral comments fuel speculation about his participation in next ipl 2026 csk vs mi ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  వచ్చే ఐపీఎల్ లోనూ ఆడనున్న ధోని.. హింట్ ఇచ్చేశాడా? అతని కామెంట్లు వైరల్!

వచ్చే ఐపీఎల్ లోనూ ఆడనున్న ధోని.. హింట్ ఇచ్చేశాడా? అతని కామెంట్లు వైరల్!

ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ పై చర్చ సాగుతూనే ఉంది. అతను ఇక లీగ్ ను వదిలేస్తే మంచిదనే విమర్శలూ వస్తున్నాయి. కానీ ధోని మాత్రం ఐపీఎల్ సీజన్ లోనూ ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా అతని కామెంట్లు వైరల్ గా మారాయి.

ధోని (AFP)

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. 8 మ్యాచ్ ల్లో రెండు మాత్రే గెలిచి, ఆరు ఓడిన ఆ టీమ్ దాదాపుగా ప్లేఆఫ్స్ కు దూరమైనట్లే. ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచ్ లూ గెలవడంతో పాటు ఇతర టీమ్స్ ఫలితాలపై ఆధారపడాలి. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ ను ఉద్దేశించి ధోని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వచ్చే ఐపీఎల్ సీజన్ లోనూ ధోని ఆడే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఐపీఎల్ 2026 కోసం

ఆదివారం (ఏప్రిల్ 20) ముంబయి ఇండియన్స్ చేతిలో సీఎస్కే చిత్తయింది. ఈ ఓటమి తర్వాత ధోని మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

“మనం సక్సెస్ కావడానికి మంచి క్రికెట్ ఆడటం ముఖ్యం. అలాగే మంచి క్రికెట్ ఆడకపోయినా ఎక్కువగా ఎమోషన్ కాకూడదు. మ్యాచ్ లు గెలవాలంటే క్యాచ్ లు ఉపయోగపడతాయి. ఇప్పుడు మేం ముందుకు సాగాలంటే అన్ని మ్యాచ్ లు గెలవాలి. అలా జరగకపోతే వచ్చే ఏడాది సరైన కాంబినేషన్ కోసం ప్రయత్నించడం ముఖ్యం’’ అని ధోని చెప్పాడు.

బలమైన ఎలెవన్

వచ్చే ఐపీఎల్ 2026 సీజన్ కోసం బలమైన ఎలెవన్ ను తయారు చేసుకోవడం ముఖ్యమని ధోని అన్నాడు. “అనేక మంది ఆటగాళ్లను మార్చడం సరికాదు. ఈ సారి ప్లేఆఫ్స్ కు అర్హత సాధించడానికి ప్రయత్నించడం ముఖ్యం. కానీ అలా చేయలేకపోతే వచ్చే ఏడాది కోసం బలమైన ఎలెవన్ ను రూపొందించుకుని తిరిగి వస్తాం’’ అని ధోని పేర్కొన్నాడు. దీంతో ధోని వచ్చే సీజన్ లోనూ ఆడబోతున్నాడనే ప్రచారం జోరందుకుంది.

చిత్తుచిత్తుగా

చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం ముంబయి ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఛేజింగ్ లో ముంబయి 26 బంతులు ఉండగానే 177 పరుగుల లక్ష్యాన్ని అందుకుని 9 వికెట్ల తేడాతో గెలిచింది. తిరిగి ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ముంబయిని గెలిపించారు. ఫస్ట్ సీఎస్కే బ్యాటింగ్ లో డెబ్యూ బ్యాటర్ ఆయూష్ మాత్రె మెరుపులు.. శివమ్ దూబె, జడేజా హాఫ్ సెంచరీలతో ఫైటింగ్ స్కోరు చేసింది.

సూపర్ కింగ్స్ ఇప్పుడు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే తమ మిగిలిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించాలి. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ధోని తిరిగి సీఎస్కే కెప్టెన్సీ చేపట్టిన సంగతి తెలిసిందే.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం