DC vs LSG Toss: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ విశాఖపట్నంలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ డీసీ గెలిచింది. అయితే మొదట లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ చేయనుంది. డీసీకి అక్షర్ పటేల్, ఎల్ఎస్జీకి రిషబ్ పంత్ కెప్టెన్లుగా ఉన్నారు. ఈ మ్యాచ్ కు కేఎల్ రాహుల్ దూరంగా ఉన్నాడు.
రిషబ్ పంత్ 9 సీజన్లపాటు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడగా.. తొలిసారి ఈ సీజన్లో ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా బరిలోకి దిగుతున్నాడు. టాస్ గెలిచి ఉంటే తాను కూడా మొదట ఫీల్డింగ్ ఎంచుకునే వాడినని అతడు అన్నాడు. విశాఖపట్నంలో రాత్రిపూట మంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉండటంతో మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడానికి డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ మొగ్గు చూపాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కొన్ని సీజన్లుగా తన రెండో హోమ్ గ్రౌండ్గా విశాఖపట్నాన్ని ఎంచుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ విశాఖలోనే జరగనుంది. రెండు టీమ్స్ లోనూ మంచి హిట్టర్లు ఉండటంతో ఇందులో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ లో జేక్ ఫ్రేజర్ మెక్గర్క్, కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్ లాంటి వాళ్లు ఉండగా.. అటు లక్నో సూపర్ జెయింట్స్ లో మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, నికొలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ లాంటి వాళ్లు ఉన్నారు. టీమిండియా తరఫున ఈ మధ్య మిడిలార్డర్ లో ఆడుతున్నట్లే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా మిడిల్ లోనే అతడు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.
ఢిల్లీకి అక్షర్ పటేల్, లక్నోకు రిషబ్ పంత్ కెప్టెన్లుగా ఉన్నారు. ఇప్పుడీ రెండు టీమ్స్ మధ్య వార్ ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ గత 17 సీజన్లుగా ఆడుతున్నా ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేదు. ఇటు లక్నో 2022లో అడుగుపెట్టగా.. మూడు సీజన్లపాటు ట్రోఫీని సాధించలేకపోయింది.
ఇప్పుడు కొత్త టీమ్స్, కొత్త కెప్టెన్లు, కొత్త కోచ్ ల నేతృత్వంలో ఎలా ఆడతాయో చూడాలి. లక్నో టీమ్ ఓనర్ చేతుల్లో అవమానపడి ఆ ఫ్రాంఛైజీ నుంచి తప్పుకున్న కేఎల్ రాహుల్.. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. అయితే లక్నోతో మ్యాచ్ కు అతడు దూరం కావడం గమనార్హం. అతడు సెలెక్షన్ కు అందుబాటులో లేడని టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది.
సంబంధిత కథనం