Super Over: బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చివరి బాల్ వరకు క్రికెట్ అభిమానులకు ఉత్కంఠను పంచింది. స్కోర్లు టై కావడంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ ఓవర్లో అద్భుత బౌలింగ్తో ఢిల్లీ క్యాపిటల్స్కు విజయాన్ని అందించాడు మిచెల్ స్టార్క్.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 188 పరుగులు చేసింది.
అబిషేక్ పొరెల్ 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 38 తో పాటు స్టబ్స్, అక్షర్ పటేల్ తలో 34 పరుగులు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించింది. లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కూడా ఇరవై ఓవర్లలో 188 పరుగులు చేయడంలో మ్యాచ్ టైగా మారింది.
ఓపెనర్ యశస్వి జైస్వాల్, నితీష్ రాణా హాఫ్ సెంచరీలతో రాజస్థాన్ గెలిపించేందుకు చివరి వరకు పోరాడారు. చివరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి తొమ్మిది పరుగులు అవసరం కాగా...స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. ధృవ్ జురేల్ రనౌట్ కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది.
సూపర్ ఓవర్లో కూడా స్టార్క్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో రాజస్థాన్ రెండు వికెట్లు కోల్పోయి కేవలం 11 పరుగులే చేసింది. సూపర్ ఓవర్లో రాజస్థాన్ తరఫున హెట్మేయర్, రియాన్ పరాగ్ బ్యాటింగ్ దిగారు. తొలి బంతికి స్టార్క్ పరుగులేమి ఇవ్వలేదు. రెండో బంతికి హెట్మేయర్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత బాల్ సింగిల్ తీశాడు. ఆ తర్వాత బాల్ను పరాగ్ బౌండరీకి తరలించాడు. అది నో బాల్ కావడం రాజస్థాన్కు మరో పరుగు కలిసి వచ్చింది. ఆ తర్వాతి రెండు బాల్స్కు పరాగ్, హెట్మేయర్ రనౌట్ అయ్యారు. రెండు వికెట్లు కోల్పోవడంతో ఐదు బాల్స్తోనే రాజస్థాన్ సూపర్ ఓవర్ ముగిసింది.
సూపర్ ఓవర్లో ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్, స్టబ్స్ బ్యాటింగ్ దిగారు. సందీప్ శర్మ వేసిన తొలి బంతికే రాహుల్ రెండు పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత బాల్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి సింగిల్ తీశాడు. నాలుగో బాల్ను స్టబ్స్ సిక్స్గా మలచడంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని సాధించింది.
కాగా ఈ మ్యాచ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఐపీఎల్లో అత్యధిక సూపర్ ఓవర్స్ ఆడిన టీమ్, సూపర్ ఓవర్స్లో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు సార్లు సూపర్ ఓవర్స్ మ్యాచులు ఆడింది. ఇందులో నాలుగింటిలో గెలిచింది. 2013లో మాత్రం ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైంది. సూపర్ ఓవర్స్లో అత్యధిక విజయాలు అందుకున్న టీమ్గా పంజాబ్ కింగ్స్ (మూడుసార్లు) రికార్డ్ను ఢిల్లీ బ్రేక్ చేసింది.
చివరగా 2021లో ఐపీఎల్లో సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది. అప్పుడు కూడా ఢిల్లీ క్యాపిటల్స్నే విజయం వరించింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీని అక్షర్ పటేల్ గెలిపించాడు. సేమ్ సీన్ను నాలుగేళ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ రిపీట్ చేయడం గమనార్హం.