IND vs AUS 4th T20: గత మ్యాచ్లో గెలుపు అంచున ఒత్తిడికి గురై ఓటమి పాలైన టీమిండియా మరోపోరుకు సిద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్లో నేడు (డిసెంబర్ 1) నాలుగో మ్యాచ్ జరుగుతోంది. రాయ్పూర్ వేదికగా జరుగుతున్న ఈ నాలుగో టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్కు బరిలోకి దిగనుంది.
గత మ్యాచ్తో పోలిస్తే ఈ నాలుగో టీ20 కోసం తుది జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేసింది టీమిండియా. ముకేశ్ కుమార్, దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్, జితేశ్ శర్మ భారత జట్టులోకి వచ్చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ జట్టు నుంచి ఔట్ అయ్యారు.
ఆస్ట్రేలియా ఏకంగా తుది జట్టులో ఐదు మార్పులు చేసింది. మార్కస్ స్టొయినిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, జోస్ ఇంగ్లిస్, రిచర్డ్ సన్, ఎలిస్ను ఆసీస్ పక్కన పెట్టింది. క్రిస్ గ్రీన్, మెక్డెర్మోట్, డ్వార్షస్తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చారు.
భారత తుదిజట్టు: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్
ఆస్ట్రేలియా తుదిజట్టు: జోష్ ఫిలిప్స్, ట్రావిస్ హెడ్, బెన్ మెక్డెర్మోట్, ఆరో హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), బెన్ డ్వార్షస్, క్రిస్ గ్రీన్, జేసన్ బెహరండాఫ్, తన్వీర్ సంఘా
ఈ ఐదు టీ20 సిరీస్లో భారత్ తొలి రెండు మ్యాచ్లు గెలిచింది. మూడో మ్యాచ్లో ఆసీస్ విజయం సాధించింది. ఈ నాలుగో టీ20లో గెలిస్తే భారత్కు సిరీస్ పక్కా అవుతుంది.