వరుస పరాజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై ఎట్టకేలకు ఓ విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన ఉత్కంఠ పోరులో రెండు వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ను చిత్తు చేసింది. ఓటమి ఖాయమనుకున్న చెన్నైకి బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్తో విజయాన్ని అందించాడు. ఉర్విల్, దూబే రాణించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ 179 పరుగులు చేసింది. ఈ టార్గెట్ను 19.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చెన్నై ఛేదించింది.
లక్ష్య ఛేదనలో బరిలో దిగిన చెన్నైకి ఇన్నింగ్ రెండో బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ ఆయుష్ మాత్రమే పరుగులు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. మరో ఓపెనర్ కాన్వే కూడా డకౌట్ అయ్యాడు. ఉర్విల్ పటేల్ కోల్కతా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
ఎడాపెడా సిక్సర్లు బాదాడు. కేవలం 11 బాల్స్లోనే నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్తో 31 పరుగులు చేశాడు. ధాటిగా ఆడుతోన్న అతడిని హర్షిత్ రానా ఔట్ చేశాడు.ఆ తర్వాత జడేజా, అశ్విన్ కూడా తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో 60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో పడింది.
ఓటమి ఖాయమనుకున్న చెన్నైని బ్రెవిస్, దూబే కలిసి విజయం దిశగా నడిపించారు. ఒక్క ఓవర్లోనే మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయింది. వైభవ్ అరోరా వేసిన 11వ ఓవర్లో బ్రెవిస్ ఏకంగా 30 పరుగులు చేశాడు. మూడు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదాడు. 25 బాల్స్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో ధాటిగా ఆడుతోన్న బ్రెవిస్ను వరుణ్ చక్రవర్తి బోల్తా కొట్టించాడు.
శివమ్ దూబే, ధోనీ బ్యాట్ ఝులిపించలేకపోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివరి రెండు ఓవర్లలో 18 పరుగులు చేయాల్సిన తరుణంలో శివమ్ దూబే (40 బాల్స్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 45 రన్స్), నూర్ ఔట్ కావడంతో కోల్కతా గెలిచేలా కనిపించింది. కానీ చివరి వరకు క్రీజులో ఉన్న ధోనీ చెన్నైని గెలిపించాడు. ధోనీ 17 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కోల్కతా బౌలర్లలో వైభవ్ అరోరా మూడు, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా ఆరంభం ఆదిరిన చివరలో తడబడటంతో 179 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ రహానే (33 బాల్స్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 48 పరుగులు) నరైన్ (26 రన్స్) ధాటిగా ఆడటంతో కోల్కతా ఏడు ఓవర్లలోనే 69 పరుగులు చేసింది.
రహానే, నరైన్ ఔట్ కావడంతో కోల్కతా స్కోరు వేగం తగ్గింది. రసెల్ 21 బాల్స్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. మనీష్ పాండే చివరి వరకు క్రీజులో ఉన్న ధాటిగా ఆడలేకపోయాడు. 28 బాల్స్లో 36 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
సంబంధిత కథనం