Champions Trophy Final Time: రేపే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్.. టైం, స్ట్రీమింగ్ వివరాలు ఇలా-champions trophy final india vs new zealand match time and streaming details everything you need to know ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Champions Trophy Final Time: రేపే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్.. టైం, స్ట్రీమింగ్ వివరాలు ఇలా

Champions Trophy Final Time: రేపే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్.. టైం, స్ట్రీమింగ్ వివరాలు ఇలా

Champions Trophy Final Time: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మెగా పోరు రేపే. ఆదివారం ఫైనల్లో భారత్ తో న్యూజిలాండ్ తలపడబోతోంది. ఈ టైటిల్ క్లాష్ ను ఎప్పుడ, ఎక్కడ చూడాలో తెలుసుకోండి. మ్యాచ్ టైం, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు మీకోసం.

న్యూజిలాండ్ తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు ప్రాక్టీస్ లో టీమిండియా ఆటగాళ్లు (Surjeet Yadav)

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ క్లాష్ కు రంగం సిద్ధమైంది. ఆదివారం (మార్చి 9) దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మ్యాచ్ ఏ సమయానికి ఆరంభమవుతుందో? ఎక్కడ చూడొచ్చో? ఇక్కడ తెలుసుకోండి.

మ్యాచ్ ఎప్పుడంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ పోరు ఆదివారం (మార్చి 9) మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు టాస్ వేస్తారు.

మ్యాచ్ ఎక్కడంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ కు వెళ్లేందుకు నిరాకరించిన భారత్.. తన మ్యాచ్ లన్నింటినీ దుబాయ్ లోనే ఆడుతున్న సంగతి తెలిసిందే.

ఎక్కడ చూడొచ్చంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ పోరు స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 ఛానెళ్లలో చూడొచ్చు.

లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ కు జియోహాట్ స్టార్ వేదిక.

తుది జట్లు (అంచనా)

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్ దీప్/వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమి

న్యూజిలాండ్: విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డరిల్ మిచెల్, టామ్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రాస్ వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమీసన్, మ్యాట్ హెన్రీ/జేకబ్ డఫ్పీ/నేథన్ స్మిత్, విల్ ఒరోర్క్

అజేయంగా భారత్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ అజేయంగా ఫైనల్ చేరింది. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. గ్రూప్ దశలో వరుసగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ పై గెలిచింది. సెమీస్ లో ఆస్ట్రేలియా గండాన్ని రోహిత్ సేన దాటింది. ఇప్పుడు తుదిపోరులో ఫేవరెట్ గా బరిలో దిగబోతోంది.

ఓ ఓటమితో

మరోవైపు న్యూజిలాండ్ ఆడిన 4 మ్యాచ్ ల్లో మూడు గెలిచింది. గ్రూప్ దశలో వరుసగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ పై విజయాలు సాధించింది. చివరి గ్రూప్ పోరులో ఇండియా చేతిలో ఓటమి పాలైంది. సెమీస్ లో దక్షిణాఫ్రికాపై కివీస్ నెగ్గింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం