హోం సీజన్ షెడ్యూల్ లో బీసీసీఐ సోమవారం (జూన్) కొన్ని మార్పులు చేసింది. ముందుగా అక్టోబర్ 2025లో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే రెండవ టెస్ట్కు వేదికగా నిర్ణయించిన కోల్కతా ఈడెన్ గార్డెన్స్.. ఇప్పుడు నవంబర్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి టెస్ట్కు వేదిక కానుంది. భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే రెండవ టెస్ట్ ఇప్పుడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది.
"కోల్కతాలో జరగాల్సిన వెస్టిండీస్తో భారత్ రెండవ టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. అదే సమయంలో, నవంబర్ 14, 2025 నుండి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ న్యూఢిల్లీ నుండి కోల్కతా ఈడెన్ గార్డెన్స్కు మార్చారు’’ అని బీసీసీఐ అధికారిక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో అవుట్ఫీల్డ్, పిచ్లను మెరుగుపరుస్తున్నారు. అందుకే భారత్-ఆస్ట్రేలియా మహిళల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ ను చెన్నై నుంచి తరలించారు. మొదటి రెండు వన్డేలు న్యూ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, న్యూ చండీగఢ్లో జరుగుతాయి. మూడవ, చివరి వన్డే న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. భారత్ ఎ, దక్షిణాఫ్రికా ఏ మధ్య జరిగే మూడు వన్డే మ్యాచ్లను బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం నుండి రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి మార్చారు. ఇందుకు కారణం మాత్రం తెలియలేదు.
సంబంధిత కథనం