కర్ణాటక ప్రభుత్వం నియమించిన జస్టిస్ జాన్ మైఖేల్ డి కున్హా కమిషన్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం 'సామూహిక సమావేశాలకు అనువైనది, సురక్షితం కాదు' అని తేల్చింది. ఈ ఏడాది చివర్లో మహిళల ప్రపంచ కప్, ఐపీఎల్ 2026 మ్యాచ్లతో సహా కొన్ని పెద్ద మ్యాచ్లు ఈ వేదికపై జరగనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
ఈ ఏడాది ప్రారంభంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విన్నింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది.
స్టేడియం డిజైన్, నిర్మాణం జన సామర్థ్యానికి అనువుగా లేదని, ప్రజలకు సురక్షితం కాదని కమిషన్ కర్ణాటక కేబినెట్ ముందు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది చివర్లో ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 ప్రారంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్లకు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుండగా.. తాజా పరిశీలనను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది.
దీంతో ఆ మ్యాచ్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అవి జరుగుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జస్టిస్ జాన్ మైఖేల్ కమిషన్ చిన్నస్వామి స్టేడియం డిజైన్, నిర్మాణంలో సమస్యలను నివేదికలో ఉదహరించింది. "ఇది సామూహిక సమావేశాలకు అనుచితమైనది, అసురక్షితమైనది" అని పేర్కొంది.
ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించడం వల్ల ప్రజా భద్రతకు ప్రమాదం పొంచి ఉందని కమిషన్ పేర్కొంది. "ఈ వ్యవస్థాగత పరిమితుల దృష్ట్యా, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించే ఈవెంట్లను ఇంత పెద్ద సమావేశాలకు బాగా సరిపోయే వేదికలకు మార్చాలి. దానిని స్టేడియం అధికారులు పరిగణించాలని కమిషన్ గట్టిగా సిఫార్సు చేస్తుంది" అని కమిషన్ పేర్కొంది.
భవిష్యత్తులో ఇటువంటి విషాదకర సంఘటనలను నివారించడానికి "సామూహిక ప్రవేశం, నిష్క్రమణకు తగిన ఇన్ అండ్ అవుట్ గేట్లు, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అత్యవసర తరలింపు ప్రణాళికలు" వంటి నివారణ చర్యలను కమిషన్ సూచించింది.
జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన కేఎస్సీఏ చీఫ్ రఘురామ్ భట్, మాజీ కార్యదర్శి ఏ శంకర్, మాజీ కోశాధికారి ఈఎస్ జైరాంలపై చట్టపరమైన చర్యలకు కమిటీ సిఫారసు చేసింది.
ఆర్సీబీ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ మీనన్, డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ఎండీ టీ వెంకట్ వర్ధన్, వీపీ సునీల్ మాథుర్లపై చర్యలు తీసుకోవాలని సూచించింది. బి దయానంద, వికాశ్ కుమార్, శేఖర్ హెచ్ టి, సి బాలకృష్ణ, ఎకె గిరీష్ సహా పలువురు పోలీసు అధికారులను కూడా ఈ ఏర్పాట్లకు బాధ్యులుగా కమిషన్ పేర్కొంది.
సంబంధిత కథనం