ఐపీఎల్ 2025 సీజన్ కీలక దశకు చేరుకుంది. ఈ సీజన్ నుంచి లీగ్ దశలో ఒక్కో జట్టు నిష్క్రమిస్తోంది. ప్లేఆఫ్స్ కోసం టీమ్స్ పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ కు దూరమయ్యాయి. ఇన నాలుగు బెర్తుల కోసం ఏడు టీమ్స్ పోటీపడుతున్నాయి.
పంజాబ్ కింగ్స్ కూడా ఈ ఐపీఎల్ సీజన్ లో జోరుమీదుంది. ఆ టీమ్ 11 మ్యాచ్ ల్లో 7 గెలిచింది. 3 ఓడింది. వర్షంతో కేకేఆర్ తో మ్యాచ్ రద్దయింది. 15 పాయింట్లతో టేబుల్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. పంజాబ్ కూడా మరొక్క విక్టరీ ఖాతాలో వేసుకుంటే ప్లేఆఫ్స్ చేరొచ్చు.
ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ చెరో 14 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ముంబయి 11 మ్యాచ్ ల్లో 7 గెలిచి, 4 ఓడింది. ఇంకా 3 మ్యాచ్ లు ఆడాల్సి ఉన్న ముంబయి రెండిట్లో నెగ్గితే ఎలాంటి టెన్షన్ లేకుండా ప్లేఆఫ్స్ చేరుతుంది. ఒక్క మ్యాచ్ లో విజయం సాధించినా ఆ టీమ్ ముందంజ వేసేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి.
గుజరాత్ టైటాన్స్ కూడా 7 విజయాలు సాధించింది. కానీ ఆ టీమ్ ముంబయి ఇండియన్స్ కంటే ఓ మ్యాచ్ తక్కువే ఆడింది. 10 మ్యాచ్ ల్లో ఏడు గెలిచింది. ఇంకా నాలుగు మ్యాచ్ లు ఆడాల్సింది. ఆ టీమ్ రెండు గెలిస్తే చాలు. గుజరాత్ కు అదంత కష్టేమేమీ కాదు. కానీ నెట్ రన్ రేట్ పరంగా చూస్తే ముంబయి (1.274), గుజరాత్ (0.867) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ప్లేఆఫ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలు పెట్టుకుంది. వర్షంతో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి తప్పించుకున్న ఆ టీమ్.. 13 పాయింట్లతో ఉంది. 11 మ్యాచ్ ల్లో 6 గెలిచిన ఢిల్లీ 4 ఓడింది. ఒకటి రద్దయింది. ఢిల్లీ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగతా మూడు మ్యాచ్ ల్లో కచ్చితంగా రెండు గెలవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మూడు గెలిస్తే ఢోకా ఉండదు.
కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ కు మరింత ప్లేఆఫ్స్ దారి కఠినంగా కనిపిస్తోంది. ఈ రెండు 11 మ్యాచ్ ల్లో 5 గెలిచి, 6 ఓడాయి. కానీ ఓ మ్యాచ్ రద్దు కారణంగా కేకేఆర్ ఖాతాలో 11 పాయింట్లున్నాయి. లక్నో 10 పాయింట్లతో ఉంది. ఇంకా మూడు మ్యాచ్ ల చొప్పున ఈ రెండు టీమ్స్ ఆడాల్సి ఉన్నాయి. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ ల్లో కేేకేఆర్, లక్నో తప్పనిసరిగా గెలవాలి. అప్పుడు కూడా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం