AP SSC Results 2025 : పదో తరగతి పరీక్షా ఫలితాలు ఎప్పుడు వస్తాయి.. ఎలా చెక్ చేసుకోవాలి.. ఇవిగో సింపుల్ స్టెప్స్!-when will andhra pradesh ssc results released and how to check ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Ssc Results 2025 : పదో తరగతి పరీక్షా ఫలితాలు ఎప్పుడు వస్తాయి.. ఎలా చెక్ చేసుకోవాలి.. ఇవిగో సింపుల్ స్టెప్స్!

AP SSC Results 2025 : పదో తరగతి పరీక్షా ఫలితాలు ఎప్పుడు వస్తాయి.. ఎలా చెక్ చేసుకోవాలి.. ఇవిగో సింపుల్ స్టెప్స్!

AP SSC Results 2025 : ఇటీవల ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చాయి. ఇక టెన్త్ రిజల్ట్ కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ నెలలోనే ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇందుకోసం బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలు వచ్చాక ఎలా తెలుసుకోవాలి.. ఓసారి చూద్దాం.

ఏపీ పదో తరగతి ఫలితాలు (unsplash)

రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 17 నుంచి 31 మధ్య పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ సంవత్సరం 6.5 లక్షలకు పైగా విద్యార్థులు బోర్డు పరీక్షలు రాశారు. ఇంటర్‌లో అడ్మిషన్ల కోసం పదో తరగతి ఫలితాలు కీలకం. అందుకే విద్యార్థులు, వారి పేరెంట్స్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. అటు బోర్డు అధికారులు కూడా ఫలితాలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాల విడుదలపై త్వరలోనే స్పష్టత రానుంది.

ఫలితాలు విడుదల అయ్యాక.. అధికారిక వెబ్‌సైట్ bseaps.in ద్వారా తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలు, సమస్యలు ఉన్నా దీని ద్వారా బోర్డు దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఏపీ ఎస్సెస్సీ ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాలు..

పరీక్ష పేరు- ఆంధ్రప్రదేశ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పరీక్ష 2025

బోర్డు- సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు, ఆంధ్రప్రదేశ్

ఫలితం పేరు- ఏపీ ఎస్సెస్సీ ఫలితాలు 2025

అధికారిక వెబ్‌సైట్- bse.ap.gov.in

ఫలితాల విడుదల - ఏప్రిల్ 2025 (అంచనా)

ఫలితాల ప్రకటన మోడ్- ఆన్‌లైన్, ఎస్ఎంఎస్, డిజిలాకర్

ఫలితాల కోసం కావాల్సింది- రోల్ నంబర్

ఇలా చెక్ చేయాలి..

1.అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in ను ఓపెన్ చేయాలి.

2.పదో తరగతి పరీక్షా ఫలితాల ట్యాబ్‌ను ఎంచుకోవాలి.

3.సూచించిన కాలంలో రోల్ నంబర్ ఎంటర్ చేయాలి.

4.స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి.

5.భవిష్యత్తు అవసరాల కోసం ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఎస్ఎంఎస్ ద్వారా..

విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో చూడలేకపోతే.. ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

మీ మొబైల్‌లో ఎస్ఎంఎస్ యాప్‌ను ఓపెన్ చేయాలి.

పదో తరగతి రోల్ నంబర్‌ను నమోదు చేయాలి.

55352 నంబర్‌కు సందేశం పంపాలి.

వెంటనే మొబైల్‌కు ఫలితాలు వస్తాయి.

దాన్ని డిలీట్ చేయకుండా ఉంటే మంచిది.

మెమోలో ఏముంటాయి..

రోల్ నంబర్

విద్యార్థుల పేరు

జిల్లా పేరు

సబ్జెక్టులు (మూడు భాషలు, మూడు ఇతర సబ్జెక్టులు)

ఇంటర్నల్ మార్కులు

సగటు గ్రేడ్ పాయింట్

గ్రేడ్ పాయింట్లు

క్వాలిఫైయింగ్ స్టేటస్ (ఉత్తీర్ణత/ఫెయిల్)

2024 ఫలితాలు..

గతేడాది 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 89.17 శాతం అమ్మాయిలు పాస్ అయ్యారు. 84.32 శాతం అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు. 69.26 శాతం మంది విద్యార్థులు ఫస్ట్ డివిజన్‌లో పాసయ్యారు. 11.87 శాతం మంది సెకెండ్ డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించారు. 5.6 శాతం మంది విద్యార్థులు థర్డ్ డివిజన్‌లో పాసయ్యారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం