యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మంగళవారం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 తుది ఫలితాలను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో శక్తి దూబే టాపర్ గా నిలిచారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) లకు అధికారులను ఎంపిక చేయడానికి సివిల్ సర్వీసెస్ పరీక్షను ప్రతి సంవత్సరం ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో నిర్వహిస్తారు.
2024 సెప్టెంబరులో నిర్వహించిన రాత (మెయిన్) పరీక్షకు మొత్తం 14,627 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 2,845 మంది అభ్యర్థులు తుది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరిలో 1,009 మంది అభ్యర్థులను (725 మంది పురుషులు, 284 మంది మహిళలు) వివిధ సర్వీసుల్లో నియామకాల కోసం కమిషన్ సిఫారసు చేసింది. ఈ సంవత్సరం ఫలితాల్లో టాప్ 5 లో ముగ్గురు మహిళలు ఉండడం విశేషం. యూపీఎస్సీ 2024 పరీక్షలో టాపర్లుగా నిలిచిన వారి ప్రొఫైల్స్ ఇలా ఉన్నాయి.
శక్తి దూబే 2024 సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాపర్ గా నిలిచారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి బయోకెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) పూర్తి చేశారు. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఐచ్ఛిక సబ్జెక్టులుగా యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష రాశారు.
హర్షితా గోయల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2024 లో రెండో ర్యాంకు సాధించారు. బరోడాలోని ఎంఎస్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్స్ ఇన్ కామర్స్ పట్టా పొందారు. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఐచ్ఛిక సబ్జెక్టులుగా సివిల్స్ మెయిన్స్ రాశారు.
యూపీఎస్సీ 2024 ర్యాంకింగ్స్ లో డోంగ్రే అర్చిత్ పరాగ్ మూడో స్థానంలో నిలిచారు. వెల్లూరులోని వీఐటీ నుంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech) పట్టా పొందారు. పరాగ్ ఆప్షనల్ సబ్జెక్టుల్లో ఒకటి ఫిలాసఫీ.
షా మార్గీ చిరాగ్ యూపీఎస్సీ 2024 ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానంలో నిలిచింది. అహ్మదాబాద్ లోని గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. చిరాగ్ ఆప్షనల్ సబ్జెక్టుల్లో ఒకటి సోషియాలజీ.
యూపీఎస్సీ సీఎస్ఈ 2024 పరీక్షల్లో ఆకాశ్ గార్గ్ ఐదో స్థానంలో నిలిచాడు. ఢిల్లీలోని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ పూర్తి చేశారు. షా మార్గీ చిరాగ్ లాగే ఆకాశ్ గార్గ్ కూడా సోషియాలజీని ఐచ్ఛిక సబ్జెక్టుగా తీసుకున్నారు.
యూపీఎస్సీ 2024 పరీక్షలో టాప్ 25 క్వాలిఫై అయిన అభ్యర్థుల్లో 11 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. వీరి విద్యార్హతలు ఇంజినీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్ నుంచి కామర్స్ వరకు ఉంటాయి. వీరు ఐఐటీ, వీఐటీ, జేఎన్ యూ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వంటి దేశంలోని వివిధ ప్రముఖ సంస్థల నుంచి కూడా వచ్చారని కమిషన్ తెలిపింది. వీరు ఆంత్రోపాలజీ, జాగ్రఫీ, మ్యాథమెటిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తదితర ఆప్షనల్ సబ్జెక్టులు తీసుకున్నారు.
2024 సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజేతలుగా నిలిచిని వారిలో 45 మంది దివ్యాంగులున్నారు. వారు ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో విజయం సాధించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వీరిలో 12 మంది ఆర్థోపెడిక్ వికలాంగులు, 8 మంది దృష్టి లోపం, 16 మంది వినికిడి లోపం ఉన్నవారు, 9 మంది బహుళ వైకల్యాలు ఉన్నవారు ఉన్నారు.
సంబంధిత కథనం